Saturday, September 28, 2013

ఏవరు గొప్ప? తల్లా? పెళ్ళామా ?


అమ్మ జన్మనిస్తుంది బ్రతకడం నేర్పుతుంది అప్పడు ఆ బ్రతుకులోకి బిడ్డకి తోడు కోసం కోడలని కోరితెస్తుంది! కొందరు మంచివారే వస్తారు ఇంకొందరు అమ్మ బిడ్డలా మధ్య అగాధం కోసం వృధా ప్రయత్నం చేస్తారు అయిన అమ్మ బిడ్డ మనశ్శాంతి కోసం రాజీ పడుతుంది అందుకే అమ్మ ఎన్నటికి ఉత్తమమైనది

అమ్మతో మాట్లాడుతున్నారా?


అమ్మ.... రెండు అక్షరాలు.. నిఘంటు అర్థాలకు అతీతమైనవి... మనిషి పుట్టుకకు మరో పేరు అమ్మ. నిశ్శబ్దంలోనూ వినిపించే ఒకే ఒక్క శబ్దం అమ్మ.. అమె తనువు బిడ్డలది.. ఆమె తపన తీరనిది.. ఆమె మమత కాలం కంటే వేగంగా హృదయాలను తాకేది.. అమ్మ గురించి ఎందరు ఎన్ని రాసినా ఏం చాలుతుంది.. సృష్టే ఆమె అయినప్పుడు ఆమెను సంపూర్ణంగా చూసేందుకు ఎన్ని కళ్లు చాలుతాయి? మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? భయంతో వణికిపోతున్నారా? జీవితంలో అన్నీ కోల్పోయానన్న ఆందోళనలో ఉన్నారా? ఏం చేయాలో తోచక.. దారి కనిపించక.. జీవితంపై విరక్తి కలిగినప్పుడు మీరేం చేస్తారు.. అర్థం కావటం లేదా? ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడండి.. ఒక్క క్షణం ఆప్యాయంగా ఆమె పలుకులు వినండి.. ఆమె మాట మీకు స్వాంతన చేకూరుస్తుంది.. అన్ని టెన్షన్లూ మటుమాయమవుతాయి.. ఎందుకంటారా? ఆమె అమ్మ కాబట్టి.. కాలంతో పోటీ పడి గెలిచే వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు అమ్మ.. జన్మనిచ్చినప్పటి నుంచీ అమ్మకు పిల్లలే లోకం.. పిల్లలే తనువు.. పిల్లలే సర్వస్వం... అన్నం తినటం దగ్గర నుంచి అక్షరాలు నేర్చే దాకా ఆదిగురువు అమ్మ.. మాట నేర్పేది అమ్మ.. మంచి నేర్పేది అమ్మ.. తన కళ్లతో లోకాన్ని చూపించేది అమ్మ.. బుడిబుడి అడుగులతో నడవటానికి ప్రయత్నిస్తూ బిడ్డ తడబడ్డప్పుడు ఆ తడబాటును సరిదిద్దేది అమ్మ.. పెద్దగా పెరిగాక తప్పు చేస్తే, ఆ తప్పును కాచి బిడ్డను తన చాటున ఉంచుకుని కాపాడుకునే ఆత్మబంధువు అమ్మ మోకాలిపైదాకా చీర కట్టి ఎంత కష్టమైనా పడుతుందేమో కానీ, కన్నబిడ్డ కష్టాన్ని ఒక్కక్షణం కూడా చూడలేదు అమ్మ.. తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె స్పర్శ మనకు కలిగించే స్వాంతన ఎంత గొప్పది.. మనం ఆందోళనలో ఉన్నప్పుడు తలలో వేళ్లు ఉంచి సున్నితంగా నిమురుతూ అమ్మ ఇచ్చే ఓదార్పు మరెక్కడ లభిస్తుంది? ఇవాళ ఉద్యోగాల కోసమో..వ్యాపారం కోసమో ఎక్కడెక్కడికో వలసలు వచ్చి బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. ఎక్కడో సుదూరంగా ఊళ్లో ఉన్న తల్లి.. ఇంకెక్కడో నగరాల్లో క్షణమైనా తీరిక లేని సంతానం.. ఇద్దరి మధ్య పలుకే కరవైన పరిస్థితి.. ఈ దశలో ఒక్కసారి ఫోన్‌లోనైనా ఆమ్మ మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత ఉల్లాసంగా ఉంటుంది? ఇది ఎవరికి వారికే కలిగే అనుభవం... విస్కాన్సన్‌ యూనివర్సిటీ దీనికోసం ఓ పెద్ద పరిశోధన చేసి మన ఒత్తిళ్లనుంచి దూరం చేసేది అమ్మ మాట అని తేల్చింది... ఇందుకోసం ఇంత పరిశోధన దేనికో అర్థం కాదు.. మన కల్చర్‌లోనే నరనరానా జీర్ణించుకుని పోయిన పదం అమ్మ... ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.. ఇక్కడ అమ్మ అన్న మాట అత్యంత సాధారణంగా వినిపించేది.. కాస్త పక్కకు జరుగమ్మా.. ఏమ్మా బాగున్నావా అలా కాదమ్మా ఇలా చేయి.. అనే మాటలు మన దగ్గర ఎక్కడైనా వినిపించేవి.. చిన్న దెబ్బ తగిలితే మొదట మన నోటి వెంట వచ్చే మాట అమ్మ.. అమ్మ ఆప్యాయతకు ఇంతకంటే అర్థం ఏం కావాలి.. అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సృష్టి రహస్యమే అమ్మ... అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.. హాపీగా ఉండండి.

నా మంచి మాటలు తరువాయి భాగం పార్ట్ -4



1) సమర్ధుడికి ఎదురు లేదు – అసమర్ధుడికి ఎదుగు లేదు ! కాబట్టి మీరు సమర్ధుడిగా ఉంటారో అసమర్దుడిగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి ---- రఘు
2)డబ్బు ఎంత వున్నా సంపాదించలేని విలువలు కొన్ని వుంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవరించుకొంటే మనం ధన్యులం కాగలం . మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి.. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటి వారి కష్టాలు మన కష్టాలుగా తలిచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చుచేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. ---- రఘు
3)మనిషిలోని ఆశకూడా మంచితనాన్ని పతనం చేస్తుంది. విఘాతాన్ని కల్గిస్తుంది.. కోర్కెలు తీరినా తీరకపోయినా ఆనందంగా వుండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచినే ఆచరించాలి. చేతితో మంచి పనులు చేయాలి. నోటితో మంచిమాటలు మాట్లాడాలి. వీటవలన ఆనందం కలుగుతుంది . . మంచి పలుకు- విను- చూడు ఇవే మంచి కార్యాలు. అవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. మంచితనమే మంచి సంస్కారం అనిపించుకుంటుంది. ---- రఘు
4)దేవుడు ప్రతి మనిషికీ విత్తనాలు యిస్తాడు. అవి మరేవో కావు,మన ఆనందం, ఆహ్లాదం, సంతోషం వాటిల్లో వుంటాయి. ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తేలా పంటలు పండి మనల్ని పరవశింపజేసేలా చేసుకోవడమన్నది మన చేతుల్లో వుంది. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే అవి మొలకెత్తవు. మనకు దుఃఖాన్ని మిగులుస్తాయి.కాబట్టి నువ్వు సంతోషంగా ఉండి ప్రక్కవాడ్ని కూడా సంతోషపెట్టు ---- రఘు
5)దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలయినంత తొందరగా బయటపడాలని తపిస్తాం. ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే వుండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా, సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే . అవి రెండూ మనమనుకున్నట్లు శాశ్వతం కావు. పాదరసంలా అవి మన పట్టునుండి జారిపోతాయి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మన హద్దుల్ని దాటి మనల్ని మనం చూడగలగాలి..అలా చూసినప్పుడే మన మనస్సు స్వచ్ఛమయిన సరోవరంలా తళతళలాడుతుంది ---- రఘు
6)మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సుకత చూపకుండా,ప్రక్క వాళ్ళతో పోల్చుకోకుండా వుంటే తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండగలము ---- రఘు "
7)అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు.. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికి తెలుసుకోలేడు. ---- రఘు"
8)కష్టాలు నీ శత్రువులు కాదు.నీ బలాల్ని,బలహీనతలన్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. ---- రఘు
9)అందం లేని లోటును మంచి స్వభావం పురిస్తుంది మంచి స్వభావం లేని లోటును అందం పురించలేదు ---- రఘు
10)మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. ---- రఘు
11)పచ్చ నోట్లు మనల్ని కాల్చడానికి గంధపుచెక్కలని ఇస్తాయేమోగాని ,మనకోసం కనీసం రెండు కన్నీటిబొట్లు అయిన రాల్చవు.కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేయ్యకు ---- రఘు
12)మనమెప్పుడూ లోపలికి చూసుకోం. బయటికే చూస్తాం. ప్రతి ఒక్కడూ ప్రపంచాన్ని మార్చడానికే సిద్ధపడతాడు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు మనల్ని మనం మార్చుకోవాలి . ---- రఘు
13)విజయం సాధించాలంటే దారిలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ, కష్టాలను అధిగమించి ముందుకు సాగాలి. అందుకు సంకల్పం చాలా అవసరం .మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు, సామర్థ్యానికి నిలువెత్తు అడ్డం అని చెప్పాలి. ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోను దాగి వుంటాయి. వాటికి సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి మనిషి తాను జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతాడు. సంకల్ప సిద్ధిని సాధించిన మనిషి వ్యక్తిగత జీవితంలో ఎంతోవిశిష్టమైన, గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాడు . ---- రఘు
14)మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆ మనిషిలోని సంకల్పమే అతని ప్రతిభకు, సామర్థ్యానికి తార్కాణంగా చెప్పాలి. ఈ ప్రతిభ వంటివి ప్రతి మనిషిలోను అంతర్లీనంగా దాగి వుంటాయి. వాటికి సానబెట్టి బయటకు తీసుకురాగలిగితే ప్రతి మనిషి తాను జీవితంలో అనుకున్నవి తప్పక సాధించగలుగుతాడు. ఆతని సంకల్పమే ఆ పని చేయిస్తుంది. ---- రఘు
15)తనను అరగదీసి హింసిస్తున్నా మనుషుల మీద కోపగించుకోకుండా హానిచేస్తున్నవారికి శ్రమ తెలియకుండా సువాసనలు వెదజల్లుతూ సేద తీర్చుతుంది మంచి "గంధపు చెక్క".కాబట్టి మనకి ఉపకారం చేసినవారికి ఉపకారం చెయ్యడం వింత కాదు..అపకారం చేసినవారికి కారణాలు ఎంచకుండా ఉపకారం చెయ్యడమే గొప్పతనం.దీని ఫలితంగా తప్పు చేసినవాడి మనస్సులో మార్పు కలిగే అవకాశం ఉంది. ---- రఘు
16)మనసు ఒక హద్దులేని గుర్రం – బుద్దే దానిని అదుపు చేయు కళ్ళెం .దగ్గరైతేనే మనసు కలిసేది – దూరమైతేనే విలువ తెలిసేది ! ---- రఘు
17)కొత్త అనుభవం ఎదురయినపుడు మనం అంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయాల్ని పక్కన పెట్టి వాటిని సమీపించాలి. ఏ క్షణానికాక్షణం తాజాగా వుండాలి.ఎదుకంటే ఎప్పటికప్పుడు మనసుపై దుమ్ము పేరుకుంటూ వుంటుంది. మనదృష్టిని అడ్డగిస్తూ వుంటుంది. మనసు మసకబారకుండా వుండాలంటే నిత్య చైతన్యంతంతో వున్నపుడే వీలవుతుంది. అపుడే నువ్వు స్వచ్ఛంగా వుంటావు ---- రఘు
18)భోగభాగ్యాలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మటుకు అభిమానాన్ని, ఆశీర్వచనాలను తీసుకువస్తుంది. ---- రఘు "
19)షడ్రుచుల సమ్మేళనంగా చేసేది ఉగాది పండుగ . ఈ పండుగ జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక - బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది” ...అందరికి నందన నామ సంవత్సర శుబాకాంక్షలు ---- రఘు"
20)చెడ్డ పనులు చేసి పాపాన్ని మూటకట్టుకోకు,మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో,ఆ పుణ్యమే నీ రాతను మార్చునని తెలుసుకో.. ---- రఘు
21)నీవు దాచుకున్నది చేజారిపోతుంది .ఇతరులకు ఇచ్చి సహకరించింది.,నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో..ఇది తెలుసుకొని నువ్వు వెలుగుతూ ప్రక్క వాడ్ని కూడా వెలిగించు. - రఘు
22)బలహీనత అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండేదే...కానీ దానిని భూతద్దంలో చూస్తే జీవితంలో మిగిలేది శూన్యమే..ఏమంటారు మరి? - రఘు
23)అహంతో అణువునైనా జయించలేము కానీ , ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు - రఘు
24)సంతోషం అంటే ఏమిటో తెలియడానికి దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే, సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు..ఏమంటారు? - రఘు
25)సమస్య వచ్చినపుడు అది మీదని కాకుండా గ్రద్ద లాగా ఆ సమస్య మబ్బు లాగా , మీరు పై నుండి ఆ సమస్య ని చూస్తున్నట్లు ఊహించుకోండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.మిగతా వాళ్ళు ఏమనుకుంటారొ అని ఆలోచిస్తె సమస్య ఇంకా పెద్దది అనిపిస్తుంది. - రఘు
26)కోపం లో మాటలు తూలి ఇతరులుని దూరం చేసుకునే దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గుతారు మీరు హాయిగా ఉంటారు - రఘు
27)క్రమశిక్షణ ఓ జీవన విధానంగా చేసుకోవడం వల్ల వ్యక్తికి,సమాజానికీ మేలే జరుగుతుంది...కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో పైకి రావాలంటే క్రమశిక్షణ తప్పనసిరి !! - రఘు
28)చేసిన పని మెచ్చుకునే 'ఆనందం' కంటే మెచ్చుకోలేదనే 'భాద' ఎక్కువసేపు ఉండటం సహజం ..ఏమంటారు మరి కరెక్టేనా ? - రఘు
29)తెలియంది తెలుసుకుంటే జ్ఞానం – తెలిసింది దాచుకుంటే అజ్ఞానం! - రఘు
30)ఏకాగ్రత ఏదైనా సాదిస్తుంది – నిరాశ నిలువునా ముంచుతుంది ! - రఘు
31)వచ్చిన అవకాశం వదులుకోకు – పొయినదాని కోసం ఏడవకు !! కాబట్టి ఆవకాశం వచ్చినప్పుడే దానిని సద్వినియోగాపరుచుకోవాలి అప్పుడే జీవితంలో రానించగలరు - రఘు
32)సోమరిపోతుకు చిక్కదు విజయం – కష్ట జీవికి కలుగదు దుఖం! కాబట్టి శ్రమని నమ్ముకున్నవాడికే దక్కును విజయం - రఘు
33) అత్యాశ లేని చోట ఆనందముంటుంది. ఆరాటంలేని చోట ప్రశాంతముంటుంది.కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలో మన చేతులలోనే వుంది - రఘు
34)ఎవరూ చూడలేదని తప్పు చేయకు – అందరూ చేస్తారని అప్పు చేయకు!!జీవితంలో ఈ రెండూ ప్రమాదమే - రఘు
35)నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే. - రఘు
36)పుట్టే ప్రతివాడూ పుడతాడు ఎందుకో ఒకందుకు - ఏదెటుపోతే నాకెందుకు అని ప్రతిఒక్కడూ అనుకుంటే మనమిక పుట్టడం ఎందుకు? - రఘు
37)పుట్టినా బ్రతకడం ఎందుకు? రాయీ రప్పా పుట్టా మిట్టా ఉండగా మళ్లీ మనమెందుకు..?? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటే మీ జీవితానికి పరమార్ధం దొరికినట్టే ..ఎమన్నా ఎక్కువ మాట్లాడితే క్షమించండి - రఘు
38)సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు. కాబట్టి పరోపకార్ధాయ మిదం శరీరం అన్నారు పెద్దలు - రఘు
39)పరులలో పరమాత్మను చూడడం, సాటివారికి సాయం చేయడమే దేవుని అర్చించడం కన్నా ఉత్తమమని భావించడం లాంటివి చేయడమే మనిషిగా పుట్టినందుకు మన జీవితానికి సార్ధకతవుతుంది . మనల్ని మనిషిగా గుర్తించేది కేవలం మానవత్వంతో ఉన్నప్పుడే కాని మరొకనాడు కాదనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అప్పుడే నరుడు నారాయణుడౌతాడు. నా’ అనే భావాన్నిమరచి ‘మా’, ‘మన’ అనే ధోరణి అలవరచుకున్ననాడు మనతోపాటు మన దేశం బాగుపడుతుంది., అలా మన జీవితాలను మలుచుకోగలిగిననాడు, మనం అనుభవించే సుఖాలన్నీ స్వర్గసుఖాలుగా మారతాయి - రఘు "
40)నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం, నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం, ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం, ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం, అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం, అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం! - రఘు"
41)ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ. - రఘు
42)అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి - రఘు
43)ప్రతిమనిషిలోనూ మంచిచెడు అనే రెండు ఆలోచన్లు ఉంటాయ. అయతే ఆలోచన్లు కలగగానే న్యాయంగా నీతిగా ఆలోచించి వివేకంతో ఆచరణలో పెట్టితే మంచి పనులే జరుగుతాయ. నలుగురికీ ఉపయోగపడతాయ. ఏపని చేసినా దాని వలన నలుగురికీ ఉపయోగం ఉందా తనొక్కడికే లాభపడతాడా అని ఆలోచించాలి. అంతేకాక ఆ పని వల్ల మరొకరు నష్టపోకుండా ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి. తనకు లాభం వచ్చినా ఇంకొకరు నష్టపోయేటట్టు అయతే ఆ పనిచేయకపోవడం తెలివైన పని..ఇలా ముందడుగు వేసుకుంటూపోతే జీవితంలో ఆ మనిషి ఉన్నతస్థానంలో ఉండగలడు. - రఘు
44)ఒక వ్యక్తి తన ఆశయాన్ని సాధించడానికి ఎన్నో మజిలీలు దాటవలసి వుంటుంది ఒక్కొకోక్కసారి నిరాశానిస్ప్రుహలకు కూడా గురికావచ్చు .అటువంటప్పుడు సహనం చూపినట్లైతే కఠిన సందర్బాలను కూడా సునాయాసంగా ఎదుర్కోవచ్చు .. తన గమ్యానికి ఎదురైనా గడ్డు పరిస్థితుల్లో జ్ఞానాన్ని ,ధైర్యాన్ని ,సహనాన్ని విడిచిపెట్టినట్లైతే మనిషి యొక్క ఆశలు నిరశాలుతాయి. అందుకే సహనం కన్నా సముద్రం చిన్న అన్నారు పెద్దలు. - రఘు
45)అదుపు లేకపోతే పొదుపు ఉండదు – అలుపు లేకపోతే జీవితంలో నీకు మలుపు ఉండదు ..కాబట్టి అదుపు అలుపు సరి సమానంగా చూసుకుంటూ పోయినవాడే జీవితంలో విజేతగా నిలువగలడు - రఘు "
46) ఆవేశాన్ని, అహంకారాన్ని అరిగట్టుము , లోభాన్ని వదిలివెయ్యుము, ఈర్షని ఈడ్చివెయ్యుము, ఆసూయను అంతము చెయ్యుము, ద్వేషాన్ని దులిపివెయ్యుము, ఆశను అణగద్రొక్కుము , క్రోధాన్ని గెంటివెయ్యుము, దుర్గునాలని వదిలివేయ్యుము, సద్గుణాలని స్వాగతిస్తూ పోతే అప్పుడు నీకు ఉన్న రోగాలన్నీ వదిలిపోతాయి. - రఘు"
47)శాంతముతో కోపాన్ని,ప్రేమతో ద్వేషాన్ని .దానంతో లోభాన్ని ,అహింసతో హింసని జయించవచ్చు.. - రఘు
48)రాయి ఉలి దెబ్బలకి ఓర్చుకుంటేనే విగ్రహములవుతాయి,అలాగే మనిషి ఓడిదొడుగుదెబ్బలకు ఓర్చుకుంటేనే మానవత్వమున్నమనిషవుతాడు. - రఘు
49)మంచి మాట,మంచి ఊహ మనిషికి,మనస్సుకు ఆరోగ్యకరము. - రఘు
50)స్వయంకృషితో తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగి సాధించేందుకు ప్రయత్నం చేయాలి.నిన్ను నువ్వే దీపంలా ప్రకాశింపజేసుకోవాలి.అంతేకాని పొరుగువారిని అణచివేయాలనుకునేవారికి ఎన్నటికి శాంతి సుఖాలు లభ్యం కావు.. - రఘు
51)చేదును రుచి చూడనివాడు తియ్యదనాన్ని యొక్క అర్ధం తెలుసుకోలేడు,అలాగే కష్టాలని రుచి చూడని వాడు సుఖములోని మాధుర్యాన్ని గ్రహించలేడు - రఘు "
52)దాచుకునే స్వార్ధం వద్దు..దోచుకునే ధౌర్భాగ్యం వద్దు,అపకారం వద్దు,ఉపకారమే ముద్దు. - రఘు" "
53)మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూలత్రోసేవాడు, , విద్య నేర్పినవారిని వెక్కిరించేవాడు ఉపకారం తలపెట్టినవారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడు. - రఘు"
54)ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది,ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది ,కాబట్టి పెద్దలు తన కోపమే తన శత్రువు అని అన్నారు. - రఘు
55)హింసకు ప్రతిహింస పనికిరాదు ,అలాగే చెడు చేరదీయకు,మంచి చెయ్యడం మానివేయకు. - రఘు
56)కష్టాలని ఓర్చుకో,నష్టాలని తెంచుకో,సంతోషాన్ని పంచుకో...అందరు ఈ మానసిక పరిస్థితిలో ఉంటె భాదలే ఉండవు - రఘు
57)భర్తకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు ,భార్యకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు.కాబట్టి భర్త భార్య మనస్సు అర్ధం చేసుకొని,భార్య భర్త మనస్సు అర్ధం చేసుకుంటూ పోతే వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా ఉండగలరు. - రఘు
58)అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - రఘు
59)భగవంతునిపై భారము వేసి నిర్భయంగా నడుచువాని దరికి దుఃఖము దరిచేరదు. - రఘు
60)నేను’ అనేది అహంకారం.. మేము అనుకోవటం సహకారం.. వీటి మధ్యగల సన్నని తెరను త్వరగా తొలగించుకోకపోవటం అజ్ఞానం.ఒక్కసారి ‘నేను’ అనే అహంకారాన్ని విడిచిపెడితే.. అంతా ఆనందమే. - రఘు
61)తృప్తి లేని వాడు స్వర్గంలో కూడా జీవించలేడు ,కాబట్టి సంతృప్తియే సకల సంపదలకు మూలం - రఘు
62)సంపద వల్ల దయ,జాలి పెరగాలేగాని లోపల వున్నా అంతఃశత్రువులు పెరగకూడదు అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలు సృష్టిస్తాయి.సంపాదించినా ధనం సద్వినియోగం చేసే సామర్ధ్యం లేనప్పుడు అతిగా సంపాదించడం కూడా ప్రమాదమే సంపాదన ద్వారా సాధించిన వస్తువులకు మనం యజమానులం అవుతున్నామని అనుకుంటాం కానీ నిజంగా బానిసలవుతున్నాం... - రఘు
63)విజయం సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు,సవాళ్ళు,ముళ్ళలా పలకరిస్తాయి.ఆ సమయంలోనే కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.ఎదిరించి నిలబడాలి.అప్పుడే అడ్డొచ్చిన ఆ సవాళ్ళని సాధించి విజయ సోపానాలు ఎక్కగలరు. - రఘు
64)లక్షమంది చెడుమార్గంలో పరిగెడుతున్నారు కదా అని నువ్వూ వాళ్ళతో పరుగుతీస్తే నీ ఉనికి భూస్థాపితం అయినట్లే లెక్క..ఆగి అది సరియనదా కాదా అని ఆలోచించడం మనిషి చేసే పని ..శోదించి సాధించడం వివేకవంతుడి పని..ఎక్కడో చదివింది - రఘు
65)జీవితం ఒక నది లాంటిది.అడ్డంకులనేన్నిటినో ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరగలుగుతుంది.అలాగే ఈ జీవితమనే దారిలో రాళ్లుంటాయి,ముళ్ళుంటాయి.వాటికి భయపడి వెనక్కి తిరిగితే -అధోగతి.ధైర్యంతో ముందుకు సాగితే -సకలం మన సొంతమవుతుంది.అప్పుడు జీవితం సంపూర్ణంగా మారుతుంది --ఎక్కడో చదివింది - రఘు
66)మంచిమాటలు వినకపోవడం- ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించడం- ఎదుటివారిని బాధించడం- మూర్ఖత్వం.ఎన్ని కష్టమైన పనులు - అసాధ్యమైన వాటిని కూడా ప్రయత్నించి సాధించవచ్చును గానీ- మూర్ఖుల మనసులను మాత్రం సృష్టి కర్త బ్రహ్మ కూడా మార్చలేడన్నది పెద్దల అభిప్రాయం అయినా మార్చడానికి మన ప్రయత్నం మనం చేయాలి.మానవ ప్రయత్నానికి తప్పనిసరిగా భగవంతుని తోడు ఉంటుంది. - రఘు
67)కంటికి ఎంతెంతో కనిపిస్తుంది.ఆ కనిపించిన్దంతా సొంతం కావాలంటే సాధ్యం కాదు. ఎంత ప్రాప్తముందో అంతే చేతికందుతుంది. మనం అనుభవించగలిగినదే మనది. ఇతరమైనదేది మనది కాదు. - రఘు
68)మనిషి తనను తాను తెలుసుకుంటూ ,తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ తనలోనే దేవుడున్నాడనే సత్యాన్ని గ్రహించగలిగితే ,అలాంటి వ్యక్తి కష్టాల సముద్రంలో మునిగిపోతున్న స్వర్గంలో ఉన్నట్లే,నిరంతరం ఏదో కావాలన్న అసంతృప్తితో బ్రతికే మనిషికి అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నా నరకంలో ఉన్నట్లే..కాబట్టి ఇది అర్ధం చేసుకున్న వ్యక్తి తన అరచేతుల్లోనే స్వర్గాన్ని నరకాన్ని నిర్మించుకోగలుగుతాడు - రఘు
69)వచ్చిన సమస్యకూ,కష్టానికీ బెదిరి భయపదిపోవడం అవివివేకం,పిరికితనం .చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి ,మరోసారి అవి రాకుండా జాగ్రత్తపడడం ,సమస్యని ధీరుడిలా అధిగమించడం వివేకవంతుడి లక్షణం.శ్రమ చేయడంలోనే సుఖం అనుభవించాలి.ఇష్టంతో చేసే కష్టానికెప్పుడూ సత్పలితమే ప్రాప్తిస్తుంది - రఘు
70)మనం గొప్పవాళ్లం అయ్యిన తర్వాత చప్పట్లు కొట్టేవారికంటే ,మన దగ్గర ఏమి లేనప్పుడు వెన్ను తట్టేవాళ్లే నిజమైన స్నేహితులు - రఘు
71)పనినిమొదలుపెట్టే ముందే చేయబోయే పనికి వచ్చే సుఖాలను ఏ విధంగా అంచనా వేస్తామో ఆ విధంగానే కష్టనష్టాలను కూడ అంచనావేసుకోవాలి. ఏపని చేయబోయనా అందుకు తగిన సామర్థ్యం ఉందాలేదా అని ఆలోచించుకోవాలి. సామర్థ్యాన్ని బట్టి, ఆటంకాలను తట్టుకొనేశక్తి బట్టి చేసిన పనిఫలితం ఆధారపడి ఉంటుంది. ఫలితం బాగుండాలి అనుకొంటే తగిన శ్రమ ఉండితీరాలి. అపుడేఅనుకొన్న ఫలితాలు వస్తాయ. ఇది ఏకాగ్రతతోనే సాధ్యం - రఘు
72)నీడ నిచ్చే చెట్టు,మంచి భోదనలు చేసే గురువుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది.చెంత చేరగానే చెట్టు నీడను,గురువు జ్ఞానాన్ని ఇస్తారు.చెట్టు లేకపోతే నీడ ఉండదు..గురువు లేకపోతే జ్ఞానం ఉండదు .జ్ఞానం ప్రసాదించిన ఆ గురువే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండము. - రఘు
73)కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు.ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది ...అందుకే శాంతమే శ్రీరామరక్ష అన్నారు.. - రఘు
74)కలసికట్టుగా వుంటే ఎలాంటి కార్యాన్ని అయినా సాధించవచ్చు.అయిదు వేళ్ళు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది.ఒక కుటుంబంలోగాని ,ఒక వర్గంలోగాని అందరు సయోధ్యగా ఉంటేనే వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.అందుకే ఇకమత్యమే మహా బలం అన్నారు పెద్దలు - రఘు
75)నిన్ను నీవు శోధించుకో,ఎక్కడ గాడితప్పేవో తెలుసుకో.అది సరిచేసుకుంటూ ముందుకు సాగిపో.అప్పుడు విజయం తధ్యం. - రఘు
76)మనిషి తాను ప్రేమించిన విషయం ఎపుడైనా మరిచిపోతాడేమో కాని ద్వేషించే గుణాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకొని ఉంటాడు. అందుకే ఆ ద్వేషించేగుణాన్ని దూరం చేసుకుని ,క్షమాగుణాన్ని అలవర్చుకుని ముందుకు సాగుతుపోయేవాడే జీవితంలో ఉత్తముడు కాగలడు - రఘు
77)మంచి చేసే అలవాటున్నవారికీ, మంచిని అభినందించే లక్షణాలున్నవారికీ మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. - రఘు
78)సృష్టిలో నాశనం లేని వస్తువే నిజమైన సౌందర్యం. నాశనం లేని వస్తువు ప్రపంచంలో ఒక్క దైవం తప్ప, ప్రతి వస్తువూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కాబట్టి మనం దైవాన్నే ఆశ్రయించాలి. - రఘు
79)నిండు మనస్సుతో, భక్తితో భగవంతుని ప్రార్థించితే ఆ ప్రార్థనను భగవంతుడు ఆలకించి తీరుతాడు. భగవంతునిపై విశ్వాసం ముఖ్యం. భగవంతుని స్మరణ చేస్తే క్రమంగా చిత్తశుద్ధి చేకూరుతుంది. చిత్తశుద్ధి ఉన్నవారికి భగవంతుని రక్ష దొరుకుతుంది. - రఘు
80)జన్మనిచ్చిన తల్లి, జన్మించిన భూమి ఈ రెండు స్వర్గానికంటే గొప్పవి . ‘నాస్తి మాతృ సమోగురుః’- అంటే తల్లిని మించిన గురువులు లేరు. తల్లిని మించిన దైవం లేదు.కాబట్టి నీ అభివృద్ధికి తల్లిదీవెనలు భగవంతుని దీవెనలుగా ఉపకరిస్తాయి - రఘు
81)అవివివేకం మన పతనానికి హేతువైతే ,వివేకం మనల్ని విజయ శిఖరాలకు చేర్చే నిచ్చెన అవుతుంది. అందుకే అవివేకాన్ని విడిచిపెట్టి ,వివేకంతో మసలుకోవడం మనకెంతో శ్రేయస్కరం. - రఘు
82)మనిషి ప్రవర్తనకు అతని మనస్సే మూలం.కాబట్టి మనస్సు మాట వింటూ ,కాలాన్ని వృధా చెయ్యకుండా ,అంకితభావంతో పనిచేసే మనిషి తాను కోరుకున్న ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు. ఎందుకంటే శ్రమతో నాస్తి దుర్భిక్షం : - రఘు
83)గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కాని గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది.. మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి - రఘు
84)మనసు పెట్టి ఆలోచించాలే గాని ప్రతి విషయంలో ఏదో మనకు తెలియని విషయం దాగి వుంటుంది. అది మనకు మేలు చేసే ఆలోచనను కలిగించవచ్చు. జీవితానికి కొత్త ఊపరి పోయవచ్చును. తెలుసుకోవాలనే ప్రయత్నం భవిష్యత్ ఉన్నతికి ఉపయోగపడుతుంది.అంతే కాక మనకి ఒక ఉత్తమ జీవితాన్ని ఏర్పరచుకోగలిగినవాళ్ళమవుతాము - రఘు
85)గుండెనిబ్బరం, జీవితం మీద పట్టు, మనమేం చేయగలమో అది చేస్తూ స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళగల నేర్పును ప్రతి ఒక్కరు అలవరచుకుంటే సమాజంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఇట్టే అధిగమించవచ్చు - రఘు
86)చాలామంది కష్టాలను చూసి భయపడిపోతారు , వాటిని ఎదుర్కొనకూడదని భావిస్తారు .అది ఉత్త అపోహ , నిజానికి మనిషిని రాటుదేల్చేవి కష్టాలే!. కష్టం లేకపోతే జీవితం విలువ మనిషికి తెలియదు . ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని జయించి నట్లయతే, ఆ తర్వాత జీవితం ఎంతో మధురంగా ఉంటుంది - రఘు
87)భగవంతుడనే వాడు ఉన్నాడో లేడో ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటూ సందేహాలను పెంచుకొని తన జీవితంలో కాంతిని రావడానికి వీలులేకుండా చేసుకొంటున్నారు కొందరు మనుషులు..ఇటువంటివి చేసిన వారికి జీవితపు విలువ ఏం తెలుస్తుంది. " నేను ఒక్కడే బాగుండాలి " అన్న పదాన్ని వదిలి నలుగురు మంచికోసం పాటుపడాలి. వెనువెంటనే ఆ భగవంతుడి యొక్క వెలుగు కిరణాలు మన మీద ప్రసరస్థాయి . దానితో అరణ్యం అనే మన మనస్సు కాస్తా ఆనంద నందనవనం అవుతుంది. భగవంతుడు చిరునామ కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు. కనుక ప్రతిఒక్కరూ ఆరోజు కోసం శ్రమిద్దాం - రఘు
88)ప్రకృతి నుంచి మనిషి సహకారమనేది నేర్చుకోవాలి. చెట్లు తమ పండ్లను తాము తినేయవు. నదులు తమ నీటిని తామే త్రాగేయవు.ఇవ్వటం నేర్చుకొంటే.. పుచ్చుకొనేందుకు ఎంతో ఉంటుందని గ్రహించాలి .. ఇవ్వటం తెలియకపోతే. అంతా శూన్యమే. కనుక పరస్పర సహకార పద్ధతిని అలవరచుకుంటే అంతా ఆనందమే! ‘ఇచ్చుట’లో ఉన్న హాయి.. వేరెచ్చటలేదని’ పెద్దల మాటలు అక్షరసత్యాలు. ప్రతి ఒక్కరు ఆ దిశగా అడుగులు వేయాలని మనం కోరుకుందాం . - రఘు
89)జీవితమంటే సమస్యల సంకలనం. ఏదో ఒక సమస్య లేనివారుండరు. ఒక్క చిన్న అబద్ధమాడితే, ఒక్క అకృత్యం చేస్తే- సమస్యలు తొలగిపోయి సుఖం కలుగవచ్చుమేగాని , న్యాయపథాన్ని వదలి పొందిన సుఖం మరణంతో సమానం - రఘు
90)తనను తాను స్తుతించుకోవటానికి అలవాటుపడిన మనిషి - ఎవరి గొప్పతనాన్నీ గుర్తించలేడు. ఈ దుర్గుణాన్ని మానుకొని ఎవరైనా మంచి పని చేసినప్పుడు అభినందించే గుణం ఉన్న మనిషికి తప్పక విజయ శికరాలని అందుకోగలడు - రఘు
91)దానగుణం మానవత్వానికి నిదర్శనం. తాము దానం చేసామన్నది ఎవరికీ తెలియకూడదని రహస్యంగా దానాలు చేసేవారున్నారు. ‘పుచ్చుకున్నవాడు కాదు- ఇచ్చినవాడు ధన్యుడు, నువ్వు దానం చేయదలిస్తే, దానిని స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నవారికి నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి’..ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు పుణ్యం మూటకట్టుకుంటున్నావ్ అనేవి స్మరణీయ సందేశాలు. ఎవరికో ఒకరికి ఎంతోకొంత ఇచ్చి- ఆ తరువాత ఎందుకిచ్చామా? అని విచారించకూడదు. సాధారణంగా మనం చేసినది వారికి అవసరం లేదని గ్రహించినపుడు ఈ విచారం కలగటం సహజం. నిజానికి దానికి కూడా విచారించవలసిన పనిలేదు. మాయమాటలు చెప్పి మన దగ్గర ఏదో ఒకటి తీసుకువెళ్లినవాడికి - ఆ పాప ఫలితం తప్పక అనుభవిస్తాడు. - రఘు
92)మనిషి మాట్లాడే విధానం వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. చదువు వల్ల కలిగిన జ్ఞానం మనిషి మాట్లాడే విధానంలో కనబడుతుంది. కొందరు చదువుకోకపోయినా ఎంతో సంస్కారవంతంగా మాట్లాడుతారు. కొందరు చదువుకొన్నా కూడా ఎంతో మూర్ఖంగా అవతలి వారు నొచ్చుకొనేటట్టు మాట్లాడుతారు. అది వారి సంస్కారహీనత్వాన్ని తెలియచేస్తుంది. దీనికి కారణం వారిలో స్వార్థం, అసూయ, ఈర్ష్య లాంటి దుర్గుణాలు చోటుచేసుకొని ఉండడమే. వీటిని దూరం చేసుకోవడానికి ప్రతిమనిషికి చదువుకావాలి. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందుకే భుక్తి కోసం చదవక భక్తితో చదివితే అది జ్ఞానాన్ని పెంచి మనుషులను సంస్కారవంతులను చేస్తుంది - రఘు
93)చెవులతో శబ్దాన్ని,కంటితో రూపాన్ని ,ముక్కుతో పరిమళాన్ని ,నాలుకతో రుచిని ,చర్మంతో స్పర్శని దేవుడు ప్రతి మనిషికి ఎలా ఐతే ఇచ్చాడో అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమనికుడా ఇచ్చాడు..కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి మన కృతజ్ఞతో ప్రక్కవాడు కష్టాలలో ఉంటె ఆదుకోవాలని ,ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుందాం - రఘు
94)దొంగల చేత దోచ బడనిదీ, దొరల(రాజుల) చేత లాగుకొన బడనిదీ, సోదరులచేత పంచుకో బడనిదీ, ఎంత ఉన్నా భారము కానట్టిదీ, వెచ్చించిన కొద్దీ పెరిగేదీ అయినటువంటి విద్యా ధనమే అన్ని ధనములలో ప్రధానమైనది.కాబట్టి విద్య ధనం సర్వ ధన ప్రధానం - రఘు
95)వివేకి అయిన సాధకుడు గతం వేధించేదైతే ,దాన్ని పూర్తిగా సమాధి చేస్తాడు.భవిష్యత్తుకు ఉపకరించేదైతే అమ్ములపొదిలో అస్త్రంలా పదిలంగా ఉంచుతాడు.ఇలా చేయాలంటే కటోర సాధన ఎంతో అవసరం. - రఘు
96)ఆశలానే కోరలతో,కోరికలనే పాములు మన మనస్సును ,బుద్ధిని వేదిస్తూ పెడదారులు పట్టిస్తాయి.తప్పుడు పనులకు ప్రోత్సహించి మన వ్యక్తిత్వానికి కళంకం తెస్తాయి..కాబట్టి ప్రతి ఒక్కరు మనస్సును అనునయిస్తూ మన సంకల్పానికి అనుగుణంగా మార్చుకోగలిగితే మనస్సే మన వశం అవుతుంది..అప్పుడు తప్పులు జరగడానికి ఆస్కారమే ఉండదు. - రఘు
97)కాలం గడపడానికి ఎన్నో మార్గాలు.కానీ కరిగిపోయిన క్షణాలను తిరిగి తీసుకుచ్చే మార్గం మాత్రం ఒక్కటీ లేదు..కాబట్టి కాలాన్ని వృధా చెయ్యకండి.. - రఘు
98)ఒక మంచి మాట దేని నుండి వచ్చినదో అని ఆరా తియ్యడం కంటే అది మన జీవితంలో అలవారించుకోవడం అత్యుత్తమ లక్షణం - రఘు
99)స్వార్ధంతో చేసే ఎంత మంచి పనైనా గొప్ప ఫలితాలనివ్వదు .సాటివాడిని మనిషిగా చూడటంతోనే నీలోని మానవత్వానికి రెక్కలు వస్తాయి.మంచిని గ్రహించడంలో,మంచి పనులు చేయడంలోనే దైవత్వం దాగి ఉంది.జ్ఞానం నీ నేత్రం తెరిపిస్తే ,ఆచరణ నీకు చూపునిస్తుంది .కాబట్టి మానవత్వాన్ని తెలుసుకున్న వ్యక్తికి దైవత్వం ఎక్కడో ఉండదు అది వాడిలోనే ఉంటుంది. - రఘు
100)అహం పెచ్చుమీరితే నీలోని విచక్షణా జ్ఞానం అంతరిస్తుంది.అది అంతరిస్తే పలు విధ్వంస క్రియలకుమూలహేతువౌతుంది. కాబట్టి క్రోధం, అహం, హింస మొదలగు దుర్గుణాలను అదుపులో పెట్టుకోవాలి. అపుడు మాత్రమే విజేతలగు లక్షణాలు నీలో వస్తాయి - రఘు
101)చుట్టురా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే ప్రయత్నించి చిరుదీపం వెలిగించడం మంచిది..కాబట్టి మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ప్రయత్నంతో మనం విజయ తీరానికి చేరవచ్చు - రఘు
102)క్రోధం, అహం, హింస మొదలగు దుర్గుణాలు మానవ జీవిత పతనానికి, అధోఃపాతాళానికి అంచులు వంటివి. వాటి పర్యవసానం వినాశనం కావటమే.కాబట్టి వీటిని అదుపులో పెట్టిన వాడు విశ్వవిజేత కాగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు - రఘు
103)మనకి ఏ కష్టం వచ్చినా సరే తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మెలుగుతూ తనను తాను సన్మార్గంలో నడిచేలా చేసుకొంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండేలా జీవనం సాగించాలి.ఇలా చేసే ప్రతి ఒక్కడికి కష్టమంటే ఏంటో తెలీకుండా జీవితం సాగుతుంది - రఘు
104)అమ్మ.. సృష్టిలో ఒక మధురభావన. ఆప్యాయత నిండిన అనుభూతి. అమ్మలో ఏదో తెలీని ఆరాధన ఉంది. అభిమానం ఉంది.. పద్యం... గద్యం... పాట... గేయం ఏదైనా... అమ్మ గురించి రాస్తే అది సూటిగా హృదయాన్ని తాకుతుంది. దేవుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు.కాబట్టి ఆకాశాన్ని మొత్తం కెమెరాలో ఎలా బంధించలేమో ‘అమ్మ’ని పూర్తిగా అక్షరాలలో ఆవిష్కరించడం సాధ్యం కాదు. - రఘు
105)ఏ పనిని గర్వంగా చేయరాదు.తొందరపడి కూడా చేయరాదు..అది ఎలాగంటే చెట్టుకున్న పచ్చికాయ అక్కడే ఉంటే,నెమ్మది నెమ్మదిగా ,క్రమ క్రమంగా పండుగా మారుతుంది ..అలాగే ఆ కోసిన పచ్చి కాయ మగ్గపెడితే 'పండు' అవుతుందో లేదో తెలియదుగాని చెడిపోవడం మాత్రం జరుగుతుంది .దీనిబట్టి ఏ పనైనా ,మొదలుపెట్టె ముందు ఎలా చేస్తే తేలికో,ఎలా చేస్తే కష్టమో,అంచనా వేసి నిదానంగా చేసేపని తప్పినసరిగా సత్ఫలితాలనిస్తుంది - రఘు
106)మాటలలో పరిమితిని,చేతలలో అపరిమిత సామర్ధ్యాన్ని చూపించగలగడమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం - రఘు
107)మనిషి జీవితంలో కొంత దూరం ప్రయాణించాక ,అత్యున్నత స్థాయికి ఎదగాలనుకుంటే క్రమశిక్షణ ఒక్కటే దగ్గర మార్గం.అయితే ఇది అలవరచుకోవడానికి బాగా శ్రమ పడాలి.శ్రమతో క్రమశిక్షణగా ఏ పని చేసే మనిషికైనా సరే సత్ఫలితాలు తద్యం !!! - రఘు
108)ఒక మనిషి అత్యున్నత స్థాయిలో ఉన్నా లేక అత్యల్ప స్థాయిలో ఉన్నా .. ఆ మనిషినీ ప్రేమించేది ఒక అమ్మ ఒక్కటే..అందుకనే ఆమె ఋణం ఏ జన్మలోను తీర్చుకోలేనిది..కాబట్టి తల్లిని మరిచినవాడిని భగవంతుడు కూడా రక్షించలేడు. - రఘు
109)మాట్లాడిన మాట,వదిలిన బాణం ,జరిగిపోయిన కాలం,పోయిన అవకాశం ఎప్పటికీ తిరిగి రావు..కాబట్టి ఆచితూచి అడుగు వెయ్యండి ..అప్పుడే జీవితంలో పైకి ఎదగగలరు - రఘు
110)ఎంతో కొంత సంపాదించి కూడ బెట్టుకున్నా మనిషికి తృప్తి కలుగదు. ఇంకా సంపాదించాలనే ఆశ. ఈ అంతంలేని కోరికలే మనిషిని కుప్పలా కూలదోస్తాయి. అసలు ఎవరికి ఎంత దక్కాలో అంతే దక్కుతుంది. ఇది ఏనాడో నిర్ణయించి ఉంటుంది. అత్యాశతో కోరికలు పెంచుకొని భగవంతుని మరచి ఉండడం అనేది మన జీవితాన్ని వృథా చేసుకోవడమే!!.కనుక మనం మానవ జన్మ ఎత్తింది సుఖాలను అనుభవించడం కోసం కాదు భగవత్ ప్రార్ధన చేయడం ఏ కొంత అయినా అవసరమని గుర్తించాలి - రఘు
111)అహంకారం అనేది వ్యక్తిపైనే కాదు సమాజం పైన కూడా ప్రభావం చూపిస్తుంది .ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి .  మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారికి చాలా అవసరం. కాబట్టి  అహంకారాన్ని పూర్తిగా అణిచి వేయడానికి ప్రయత్నం చేయాలి  - రఘు
112)తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి..తన మంచిని కోరినవాడు తనవాడైనా సరే వాడిని  వదిలివేయాలి. - రఘు "
113)మన జననం మన చేతుల్లో లేదు...మన మరణం కూడా మన చేతుల్లో లేదు కానీ ఎలా జీవించాలనేది మన చేతుల్లోనే వుంది..కాబట్టి … మీ జీవితం లో ప్రతి రోజు ఒక మరపురాని రోజు గా మలచుకోండి ! - రఘు"
114)శరీరాన్ని అద్దంలో చూడవచ్చు….వ్యక్తిత్వాన్ని కర్మలలో చూడవచ్చు - రఘు
115)సదా ప్రసన్నముగా ఉండుటకు ..ప్రశంస పొందాలనే కోరికను ...త్యాగం చేయుట అవసరము. - రఘు
116)కొన్ని సమయాలలో నీవు చేయదగిన గొప్ప సహాయం గౌరవించటమే - రఘు
117)ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఓర్పుతో దానిని పరిష్కరించుకోవడం మంచి పద్ధతి. సహనం వీడితే సమస్య మరింత జటిలమై ఎదురుదెబ్బలు తగలడం ఖాయం. మన ఎదుట ఉన్న సమస్యారూపాన్ని అర్థం చేసుకోవడానికి సహనం ఎంతో పనికివస్తుంది. ఓర్పు వహిస్తే కొండంత సమస్య సైతం చప్పున మాయమైపోతుంది. - రఘు
118)నక్షత్రాలు ఎంత ఎత్తునున్నా ఎలా ఆకాశానికి ఒదిగి ఉంటాయో అలాగే మనం ఎంత ఎదిగినా , మనల్ని ఇంత స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు ఎప్పటికి అలాగే ఒదిగే ఉండాలి - రఘు
119)లేని వాటి కోసం బాధ పడి మనసు పాడు చేసుకుంటే .. ఉన్నదాంట్లో కూడా నీకు ఆనందం ఉండదు ..అందుకే ఏమో అమ్మ ఎప్పుడు చెప్తుంది దేంట్లో అయిన సహనం ఓర్పు ఓరిమి ఉండాలి అని ,అవి ఉంటె ఆనందం మీ వెంటే అని.. - రఘు
120)జీవితములో  జీవించే కళ నేర్చుకునట్లయతే మనోబలం ఆత్మ  విశ్వాసము వృద్ది  అవుతాయి. - రఘు
121)నిజాయితీ పరుడువైతే నీకు చెడు నుండి  పూర్తి  స్వేఛ్చ లభిస్తుంది  - రఘు
122)వరైనా నిన్ను ఎగతాళి చేస్తే  కలత చెందకు వారికీ ఆనందాన్ని చేకురుస్తునాను అని బావించు - రఘు
123)బాహ్యముగా దు:ఖించుట కంటే  మనసులో విలపించుట ప్రమాదకరము  - రఘు "
124)గులాబీ పువ్వుని చూసి ప్రేమించకు అందులో ముళ్ళు ఉంటాయి, డబ్బుని చూసి ప్రేమించకు దానిలో ద్వేషం ఉంటుంది , మనుషులను చూసి ప్రేమించకు వారిలో మోసం ఉంటుంది, మనసుని చూసి ప్రేమించు అందులో ఉంటుంది మమతనురాగం. - రఘు"
125)స్నేహాన్ని, ప్రేమని మనం ఎదుటివాళ్ళకి  ఇవ్వాలి కానీ  తిరిగి ఆశించకూడదు, ఒక వేళ అలా ఆశిస్తే చివరికి నీకు మిగిలేది భాదే !! - రఘు
126)వ్యర్డులతో ఎకిభవిస్తే తరువాత అనుభవించాల్సింది నిందలే ... - రఘు
127)నువ్వు పంచిన ఆ మంచితనమే రేపు ఓ చెట్టు గా మొలచి నిన్ను ఆదరించక మానదు. మనిషికి వెల కట్టలేం కాని ఆదర్శ ప్రాయం గా ఉంటె ఆ మనిషి మహోన్నత శికరాలను తాకగలడు - రఘు
128)అన్ని ఒకేసారి చేయాలి అని అనుకుంటే ఒత్తిడి పెరిగి ఏమి చేయలేవు - రఘు
129)నీలో జ్యోతిని వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు - రఘు
130)అవరోధాలు,కష్టాలు పరోక్షంగా  మనిషి అభివృద్దికి దోహదపడతాయి.సమస్యలే మనలోని మనోబలాన్ని పెంచి ఎంత పెద్ద కార్యాన్నైనా మనతో  చేసేలా చేస్తాయి..కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలే భవిష్యత్తులో మనకి  పెద్ద ఆపదలు ఎదురైనా వాటిని  ఎదురుకొనే సత్తానిస్తాయి - రఘు
131)కష్టకాలములో ధైర్యముగా ఉండటమే ఉత్తమమైన లక్షణము - రఘు
132)సంకల్ప బలం  ఉన్నవాడికి సమస్యనేది ఒక అవరోధమే కాదు..నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిదేది ఉండదు. కాబట్టి మన లక్ష్య సాధనలో చిత్తశుద్ధి ఉంటె ప్రతి ఆపదనూ అధిగమించి విజయతీరాలని సులువుగా చేరగలం  - రఘు
133)సాదాగా జీవించు .. హుందాగా ఆలోచించు - రఘు
134)నీవు ఉత్సాహవంతముగా ఉండటానికి  నీ అంతరాత్మని, ఇతరుల ప్రత్యేకతలను అభినందించు. - రఘు
135)నిగ్రహం లేకుండా ప్రవర్తించేవారికి కలిగే ఫలితాలు,సంక్రమించే సంపదలు సైతం  వినాశానానికే దారితీస్తాయి ..కాబట్టి బ్రాంతి వల్ల కల్పించుకున్న ఆశ కన్నా,వివేకంతో చూసే సత్యమే గొప్పదైనది - రఘు
136)ప్రపంచం అంత పెనుతుఫాను రూపం దాల్చినపుడు అతిసుందరమైన ఆశ్రయం భగవంతుని గుడి మరియు అమ్మ ఒడి మాత్రమే - రఘు
137)సంకల్ప బలం  ఉన్నవాడికి సమస్యనేది ఒక అవరోధమే కాదు..నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిదేది ఉండదు. కాబట్టి మన లక్ష్య సాధనలో చిత్తశుద్ధి ఉంటె ప్రతి ఆపదనూ అధిగమించి విజయతీరాలని సులువుగా చేరగలం  - రఘు
138)ఆయుధాలు వాటంతట అవి ఎన్నడు ప్రమాదకరం కావు,మనిషిలో ఉన్న క్రోధమే హానికరం  - రఘు
139)శత్రువులు లేకుండా చేసుకోవటనికి ఉత్తమ మార్గం వారిని నీ మిత్రులుగా మార్చుకోవటం - రఘు
140)ఆశలు, అవసరాలు మన చేయి దాటిపోతే మనశ్శాంతీ ఉండదు, ఆరోగ్యమూ ఉండదు. ఆత్మ సంతృప్తి ఉన్నవాడికి ఆనందమూ ఉంటుంది, ప్రశాంతతా ఉంటుంది. కాబట్టి నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో  - రఘు
141)నీ అంతరాత్మే నీకు మంచి మిత్రుడు,తరచూ దానిని విను. - రఘు
142)అదృష్టం అనేది తలుపు తట్టే సమయాన్ని గ్రహించి తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో తలుపులు మూసి ఇప్పుడు తలుపులు తెరిస్తే వచ్చేది అదృష్టం కాదు దురదృష్టం.కాబట్టి ఎప్పుడూ ఎలా ఉండాలో ఆచి తూచి అడుగు వేయాలి  - రఘు
143)నిన్ను రక్షించుకునేందుకు ఇతరుల పై నింద వేయకు,కాలానికి నిజాన్ని నేరుపించే శక్తీ ఉంది  - రఘు "
144)మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం, సామాన్యునిలా ప్రవర్తించటం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది. ఎవరో, ఏదో అన్నారని కుంగిపోకండి. అలా అనే అవకాశం ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి. ఎదిగే కొలదీ ఒదిగిపొండి. తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు. ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. - రఘు"
145)ఆలోచనల మధ్య సంధి కుదిరితే ప్రపంచ  యుద్దాలు జరిగేవి కావు - రఘు
146)అనుకున్నామని జరగవు అన్ని,అనుకోలేదని ఆగవు కొన్ని,జరిగేవన్నీ మంచికని అలా అనుకోవడమే మనిషి పని . - రఘు
147)నీ ప్రత్యేకత ఇతరులను ప్రభావితం చేస్తుంది,దానిని సద్వినియోగం చేయు - రఘు
148)భాద్యతలను నిరాకరించినా వయోభారానికి భయపడినా వ్యక్తిలో పరిపక్వత లేనట్లే - రఘు
149)ప్రతి మనిషికి జీవితంలో తగిన లక్ష్యం అంటూ వుండాలి. మనిషి వ్యక్తిత్వానికి తగినట్లు తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, భవిష్యత్తుపట్ల స్పష్టమైన అవగాహన వుంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవితంలో దేనినైనా సాధించగలరు - రఘు
150)బ్రతకడం నేర్చుకో..చావడం కాదు.....మంచి ఏలా చేయాలో నేర్చుకో...చెడు గురించి కాదు....సర్వం నువ్వు అని కాదు..సర్వస్వం నిది అనుకుని బ్రతుకు...అశోక్... - రఘు
151)అపోహ,అనుమానం భయంకరమైన అనారోగ్యం,.దానిని నీలోకి  రానీయకు! - రఘు
152)ప్రతి పరిస్తితిలో  సహనసీలురుగా ఉన్నట్లయితే సంతోషము అనుభవం అవుతుంది - రఘు "
153)నేటి కన్నా నిన్న తీపి..నిన్న కన్నా రేపు తీపి.. నిన్న లేనే లేదు! రేపు రానే రాదు!! కాబట్టి సమయ పాలన ఉన్నవాడికే విజయం. - రఘు"
154)నీ మార్గములో అవరోధాలు వస్తే  భాదపడటం మాని, నీ ప్రయత్నం ప్రారభించు - రఘు
155)ఆత్మవిస్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాదించిన గొప్ప వ్యక్తుల జీవతాలన నిసితంగా పరిశీలించండి వారిని నడిపించింది ఆత్మవిశ్వసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిస్వాసం లేనివాడు నాస్తికుడు అనేది నేటి మాట. - రఘు
156)శ్రేష్టమైన ఆలోచనల బలంతో నీవు ఏది కావాలంటే అది చేయగలవు - రఘు "
157)ఇతరులును మెప్పించటం కోసం జీవించటం కాదు. పరమాత్ముని మెప్పించేందుకు జీవించు - రఘు" "
158)విజయం మేధావిని వినయవంతుడిగా, సామాన్యుడుని ఆశ్చర్యచకితునిగా, అవివేకిని అహంభావిగా చేస్తుంది - రఘు"
159)మౌనం అన్నిటికి సమాధానం చెప్తుంది.....మాటల్లో లేని అర్ధం, పరమార్ధం.. మౌనంలో ఉం - రఘు
160)మనసుతో ప్రేమిస్తే గెలుస్తావు..కళ్ళతో ప్రేమిస్తే ఓడిపోతావు.. - రఘు "
161)పేరు సంపాదించుకోవడం అంటే అమ్మ నాన్న నికు పెట్టిన పేరు కాదు..నువ్వు సంపాదించుకున మంచి పేరు ..అది నువ్వు పోయాక కూడా నలుగురు చెప్పుకునే పేరు లా నిలబెట్టుకోవాలి - రఘు"
162)జీవితం అంటే గడిచిన కాలం కాదు...నువ్వు చేసిన మంచి..నువ్వు సంపాదించుకున్న పేరు. - రఘు
163)వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించినవాడికన్నా తన మనస్సును జయించినవాడే పరాక్రమవంతుడు’’. కనుక మనస్సును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. మనో నిగ్రహం లేని వ్యక్తి అసాధారణమైన పోకడలకూ, విపరీతమైన అంతర్మథనం వల్ల కలిగే మానసిక పతనానికి గురి అవుతాడు. అత్యంత సానుకూలమైన పరిస్థితులలోకూడా అతడు తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతాడు. - రఘు
164)మన ఆలోచనలు తయారుచేసినట్లుగానే మనం తయారవుతాం. కాబట్టి మీరు దేన్నిగురించి ఆలోచిస్తున్నారన్న విషయాన్ని గురించి జాగ్రత్తపడాలి. మాటలు కాదు ముఖ్యం ఆలోచనలు! ఆలోచనలు జీవిస్తాయి. అవి ఎంత దూరమైనా పోతాయి. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మన వ్యక్తిత్వపు రంగును పులుముకుని బయటకు వెలువడుతుంది. - రఘు
165)ఇతరులను పరిహాసం చెయ్యవద్దు ….నిన్ను పరిహసించటానికి అవకాశం ఇవ్వవద్దు. - రఘు
166)ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చినా, పవిత్ర నదీ జలాలలో స్నానాలు ఆచరించినా, వేదాలు ఎన్నిసార్లు చదివినా సత్యవాక్కుతో సమానం కావు. అన్ని ధర్మాలలోకల్లా సత్యమే గొప్పది..అబద్ధాలు చెప్పడంవల్ల తాత్కాలిక ప్రయోజనాలున్నా చివరికి సత్యమే జయిస్తుంది. భగవంతుడు ఇతర జంతు జాలానికి ఇవ్వని బుద్ధి, జ్ఞానం మానవుడికి మాత్రమే ప్రసాదించాడు. వాటిని వికసింపజేసుకునేందుకు అహర్నిశలూ ప్రయత్నిద్దాం. సత్యమేవ జయతే అనే నినాదానికి జీవంపోద్దాం. - రఘు "
167)కర్రలు,రాళ్ళూ ఎముకలను విరుచును,మాటలు సంబంధాలను త్రెంచును.మాట్లాడేటపుడు జాగ్రతగా మాట్లాడాలి. పెదవి దాటితే పృథ్వి దాటును - రఘు"
168)అహంకారాన్ని , అజ్ఞానాన్ని వదిలివేయుము త్యాగం చేసే గుణం, ఇతరులను ప్రేమించే తత్వాన్ని అలవర్చుకొనుము - రఘు
169)సత్యమే తల్లి; జ్ఞానే తండ్రి; ధర్మమే సోదరుడు; దయయే స్నేహితుడు; శాంతమే భార్య; ఓర్పే పుత్రుడు. ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు. మనల్ని వెన్నంటి వచ్చే నిజ బంధువు సత్యం ఒక్కటే - రఘు "
170)కల్మషం లేని వారు ఇతరులలో మంచినే చూస్తారు, కలుషితమైన మనసు గల వారు ఎపుడ్డు చెడునే చూస్తారు. - రఘు"
171)ప్రాణులన్నీటిల్లోకల్లా ఒక్క మనిషికే ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. మనం జంతువులంకాదు మనుషులం కాబట్టి మాటలు ఆలోచించి సక్రమంగా మాట్లాడితే నీతో పాటు నిన్ను అభిమానించే పదిమంది ఉంటారు. లేదు అనాలోచితంగా, అసహనంగా, అసభ్యకరంగా, అవ్యవహరికంగా, అనుచితంగా మాట్లాడితే మిగిలేది నువ్వొక్కడివే - రఘు
172)పొగిడే వాడి కన్నా తిట్టే వాణ్ణి నమ్ము బాగుపడతావు...తిట్టే వాడు నువ్వు చెసే తప్పు ఏంటో చెప్తాడు ..మార్చుకునే వీలుంటుంది..నీకు నువ్వు ఎలాగో తెలుసుకోలేవు - రఘు
173)తక్కువ సంపాదించేటప్పుడు పొదుపు చేయ్...ఎక్కువ సంపదించేటప్పుడు తెలివిగా ఖర్చు పెట్టు..అప్పుడే జీవితంలో సుఖంగాని సంతోషం గాని ఉంటాయి - రఘు
174)మాట అనే ఆయుధాన్ని పద్దతిగా వాడితే పైకోస్తావ్ - పద్ధతి తప్పి మాట్లాడితే అదే ఆయుధానికి నువ్వే బలైపోతావ్.అందుకే సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ అందరిచేత గౌరవాన్ని అభిమానాన్ని అందుకుంటూ మనిషి అనే పదానికి మనం సరైన అర్దాన్ని ఇవ్వాలి. - రఘు
175)సృష్టిలో ప్రతి ప్రాణీ కోరుకునేది ఆనందం. ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా వారి స్థితిగతులు ఏవైనా కూడా వారి వారి స్థాయిలో ఆనందం పొందాలనే అనుకొంటారు. అయితే ఆనందం అత్యున్నతంగా, అత్యుత్తమంగా వుండాలి అంటే ఎదుటివాడి ఆనందాన్ని, స్వేచ్ఛనూ దోచుకొని మనం ఆనందాన్ని పొందాలనే దుర్మార్గపు ఆలోచన రానంతవరకూ మనిషిగా మన జన్మ సార్థకమైనట్లే.మనమంతా  ఆ దిశగా జీవిద్దాం. మానవులుగా తరిద్దాం. విశ్వశాంతి సమకూరుద్దాం. - రఘు
176)మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటె చాలు కాని మనిషి మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి.... - విశ్వ.
177)డబ్బు ఎంత సంపాదించినా మనిషికి సంతృప్తి అనేది తీరదు.అదే మనశ్శాంతి కాస్త ఉన్నా తృప్తిగా ,ఆనందంగా ,సంతోషంగా బ్రతుకు జీవనం సాగించగలం - రఘు
178)మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు కలిగే తృప్తి ఎన్ని లక్షలున్నా,కోట్లున్నా రాదు - రఘు
179)చెప్పుట-చేయుటలో సమానత్వం కలిగి ఉండుట మహాత్ముల లక్షణం  - రఘు
180)ఆలోచించే విధానము, జ్ఞాపకము ఉంచుకునే శక్తి, మాట్లాడే పధ్ధతి, విశ్లేషణ చేసే దృక్పథము మరియు విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక వీటన్నింటిని నిరంతరమూ మెరుగు పరచుకుంటూ నడిచే మనిషి తను తలపెట్టిన ప్రతి పనిని అత్యంత సామర్ధ్యం తో నిర్వహించగలుగుతాడు. - రఘు
181)మనము పుట్టుకకు ముందు మనము లేము మన మరణము తరువాత మనము ఈ భూమిపై ఉండము..అంటే జీవితమంటే మనము ఈ భూమిపై గడిపే సమయము..అది అత్యంత విలువైనది అని గమనించవచ్చు..జీవితమంటే సమయమే..సమయనాన్ని వృదా చేయటము అంటే జీవితాన్ని వృదా చేయటము తో సమానము అన్నమాట..సమయాన్ని బాగా ఉపయోగించటము అంటే జీవితాన్ని సార్ధకము చేసుకోవటము....కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని సద్వినియోగాపరుచు కోవాలి - రఘు
182)నూనె లేని దీపం వెలగదు...దైవ చింతన లేని జీవితము మెరువదు - రఘు
183)ప్రతి మనిషి లోను కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. నీలో అటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అని విశ్లేషించి తెలుసుకోవాలి. నీవు ఇష్ట పడేవి ఏమిటి, నీవు బాగా చేయ గలిగేవి ఏమిటి అనేవి తెలుసుకొని వాటిని ఇంకా అబివృద్ది చేసుకొని వాటి ద్వారా నీకు మంచి గుర్తింపు వచ్చే దారిలో ప్రయత్నము చేయాలి వాటిని నిరంతరము అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి..అలా చేసినప్పుడు నీపై నీకు విశ్వాసము పెరిగి కొత్త పనులు చేయటానికి కావలసిన మానసిక సంసిద్దత పెరుతుంది.దాని వలన కార్య దీక్ష పెరిగి విజయం సాధించవచ్చు. - రఘు
184)అర్ధము లేని భయాలతో , ఆందోళనలతో,ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అవసరమైన పనులను మనము చేయకుండా అదృష్టాన్నినిందిస్తూ పరిస్థితులను దూషిస్తూ, పనికిమాలిన సంభాషణలతో జీవితాన్ని గడుపుతారు కొందరు. సోమరితనము, నిరాశ ,నిస్పృహ,పిరికితనము మొదలైన గుణాలు వారి వ్యక్తిత్వంలో కలిసిపోయి ఇంక ఎమీ చేయలేమని భావిస్తూ జీవిస్తారు.కానీ తమలోనే దాగి ఉన్నపరిష్కారాన్ని ,మానసిక ఉత్తేజాన్ని తెలుసుకోలేరు.ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించినప్పుడు వారు తప్పక విజయం  పొందుతారు. - రఘు
185)మనకు జీవితంలో నిజమైన ఆనందం లక్ష్యాలను చేసుకుని వాటిని సాధించటం ద్వారానే వస్తుంది. మన జీవిత చివరి దశలో మనము వెనుకకి తిరిగి చూస్తే మనము సాధించిన విజయాలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. విజయము అంటే డబ్బు సంపాదన కాదు. మానసిక శాంతి, అన్ని విధాల అభివృద్ధి చెందిన వ్యక్తిత్వం. క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి, ప్రోత్సహించి, ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి - రఘు
186)మనకు జీవితంలో కనిపించే ప్రతిసమస్యా అనుకున్నంత తీవ్రంగా ఉండదు. మనకు ఎదురయ్యే ప్రతికూల సంఘటనలనుండి మనము బలంగా ఎదుగుతాము. మనశక్తి పెరుగుతుంది. క్రమముగా ప్రయత్నించినపుడు సమస్య మనకు లొంగిపోతుంది. మనలో సమస్యలపై వ్యతిరేక భావాలను సాలోచనతో అనుకూలంగా మార్చుకొని మనమీద మనము నమ్మకాన్ని పెంచుకొని జయించగలము అనే నమ్మకంతో సాగిపోవటం అవసరం. - రఘు
187)శ్రమించుట అన్నింటి కంటే గొప్ప ధర్మం, అది నీ ఎదుగుదలకు మూలం - రఘు
188)ఎవరూ పుడుతూనే గొప్ప వారిగా జన్మించరు.గొప్ప గొప్ప విషయాలను సాదించిన వారు కూడా నిరంతర ప్రయత్నము ఎన్నో ఓటముల అనంతరము విజయాలు పొందారని గుర్తించాలి. ఎవరూ ఏ పనినైనా మొదలు పెట్టిన వెంటనే పూర్తి చేయలేక పోవచ్చు కానీ ఏకాగ్రతతో చేయాలనే తపనతో చేస్తే సాదించగలరు అనే నమ్మకాన్ని బలంగా మనలో నింపుకొని మనకు ఎదురయ్యే ఓటమిని విశ్లేషిస్తూ కొత్త పదకాలతో ముందుకు నడిచే యోచనను అనుక్షణము ఆచరించిన విజయం తధ్యం! - రఘు
189)మన జీవితములో సమయము ఖర్చు పెడితే చేజారిపోతుంది.మన ప్రమేయము లేకుండానే మనము ఏ పని చేయకుండా కూర్చున్నా సమయము దొర్లిపోతుంది...ఒక్కొక్క క్షణము వజ్రము కంటే విలువైనది...అందువలన సమయ దుర్వినియోగము జీవిత దుర్వినియోగము తో సమానము..మనము ఖర్చు చేసే ప్రతినిమిషము ఎటువంటి పనిమీద చేస్తున్నాము అనే విచక్షణ అవసరము..అలా అలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి పనులకి  ఉపయోగించుకొని మంచి పేరు సంపాదించుకొగలడు  - రఘు
190)ఆయుధాలతో మనుష్యులను వంచగలరేమో గాని ,మంచి మనిషి అనిపించుకోవాలంటే మాత్రం ప్రేమనే పంచాలి - రఘు
191)ఆత్మవిశ్వాసం అనేది చాలా గొప్ప లక్షణం . ఏ పనైనా మనము చేసే కొద్ది మనకు అనుభవము పెరిగి మనకు నైపుణ్యము వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఆ పని చేయాటానికి కావలసిన మెలుకవలను సానుకూల దృక్పదంతో ఆసక్తిగా గమనించి రోజు రోజుకూ కొద్ది కొద్దిగా విజయాలను పొందుతూ ముందుకు కదలాలి. మనము చేసిన పొరపాట్లను విశ్లేషించి వాటిని రాబోయే కాలములో ఆపటానికి కావలసిన మార్గాలను గుర్తించి పాటించి సాదించాలి..అంతే కాని మొదటి ప్రయత్నము లోనే పూర్తి నాణ్యత రావాలని రాకపోతే అపజయము పొందామని భావించరాదు..మన ఆలోచనా విదానమే మన విశ్వాసము, మన శక్తి, మన కదలిక, మన జీవిత సాఫల్యము.. ఈ సిద్దాంతాలు పాటిస్తే ఆత్మ విశ్వాసం నిరంతరం మన వెంటే ఉంటుంది దానితో దేనినైనా సాధించగలం. - రఘు
192)ప్రతి ఒక్కరూ తమ దిన చర్య ఎంత తీరిక లేకుండా వున్నప్పటికీ తమలోకి తాము తొంగి చూసుకునేందుకు ప్రతినిత్యం ఎంతో కొంత సమయం కేటాయించుకోవాలి. తమ పనుల్లోని పొరపాట్లను గుర్తించి సకాలంలో సరిదిద్దుకోవాలి. వీలైనంత మేరకు అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ఎప్పటికప్పుడు ఎదుటివారి సుగుణాలను స్వీకరిస్తూ వారి వారి దోషాలను, ద్వేషాలను పొరపాటుగానైనా తమపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడగలగాలి. ఇలాంటి సందర్భాల్లోనే అభిమానాన్ని అహంభావంగా పొరపడే వారు లేకపోలేదు. స్వాతిశయానికి దారితీయని స్వాభిమానం ఎప్పుడైనా ఎక్కడైనా స్వాగతించదగిందే! - రఘు
193)సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు. అతనిలో ఉన్న నైతిక బలము అతనికి ధైర్య సాహసాలను, మానశిక శక్తిని ఇచ్చి ప్రోశ్చాహించి నడుపుతుంది - వివేకానంద
194)మాటలను మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన వరం. దానిని సద్వినియోగం చేసుకోవడం మనిషి యొక్క కర్తవ్యం. మధురంగా మాట్లాడడం మనిషి అలవాటు చేసుకోవాలి. దానివలన మనకి ఎన్నో లాభములను పొందగలము . మధురమైన మాట, యితరుల మనస్సులను ఆకర్షిస్తుంది..అంతే కాక ప్రతి ఒక్కరు సత్యం అన్న ఆయుధాన్ని తీసుకోవాలి. స్వార్థాన్ని విడనాడాలి. నలుగురు బాగుండాలి అన్న విశాల హృదయాన్ని అలవర్చుకోవాలి..అందుకే నలుగురితో మంచిగా ఉంటే నాలుగుకాలాలపాటు నీవు చల్లగా  బతుకుతావు అని పెద్దలు ఆశీర్వదించుతారు  - రఘు
195)నీవు ఎల్లప్పుడూ ఉన్నతమైన పనులే చేస్తే సరిదిద్దుకునే అవసరమే లేదు - రఘు
196)మనిషి యొక్క స్వభావం, అతని మాటలలో వ్యక్తమవుతుంది. అతని మాట తీరును బట్టి అతని వ్యక్తిత్వం తెలియబడుతుంది. అందుకే బాగా ఆలోచించిన తరువాతనే మాటలాడాలి కాని, మాటలాడిన తరువాత ఆలోచించడం వ్యర్థం - రఘు
197)ధనం మూలం ఇదం జగత్’ ఇది సత్యమే. అంతమాత్రాన అధర్మమార్గాన ధనాన్ని పొందడం సరికాదు. అందుకు ఆ శ్రీలక్ష్మి సైతం ఆమోదించదు. కష్టార్జితం కాని ధనానికి స్థిరత్వం ఉండదు. ధనమునకు అధిదేవత లక్ష్మీదేవి. ఆ దేవత కరుణా కటాక్షాలు పొందాలంటే ధర్మమార్గాన ధనధాన్యాలు, సిరిసంపదలు పొందాలి. అందుకు దానమే సరియైన మార్గం. నిజానికి దానం చేస్తే ధనం తరిగిపోతుందన్న భావన మనలో కల్గడం సహజమే. కాని ఇది సరికాదు. ధర్మబద్ధంగా పొందిన ధనంలో మన శక్తిమేరకు దానం చేయడమన్నది గమనార్హం. సక్రమార్జన సత్ఫలితాలనిస్తుంది. అక్రమార్జనతో చేసిన దానం నిలువదు గాక నిలువదు. అలా సంపాదించిన ధనం అనారోగ్యానికి మనశ్శాంతి కరవుకావడానికి అష్టకష్టాలకు కారణం కాగలదు. - రఘు
198)మనము బ్రతకటానికి ఎంచుకున్న వృత్తి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగకూడదు. మనం బ్రతుకుతూ, మనచుట్టూ వున్న సమాజాన్ని అభివృద్ధి చేయాలి. మన పనులు సమాజ నిర్మాణానికి తోడ్పడాలికాని వినాశమువైపు పోరాదు. అలా యితరులకు నష్టము కలుగచేసేవృత్తి కాలక్రమములో నాశనము కాకతప్పదు. నీవు ఈసమాజంలో అంతర్భాగము. యితరులకు నష్టము జరిగితే నీకు జరిగినట్లే. నీకు కూడా ఆ నష్టము కాలక్రమములో సంక్రమిస్తుం - రఘు
199)పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తూ ఉంటారు, అది నిజమే కాని అది కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమె....ఈష్యా.. అసూయ.. అహంభావం.. గర్వం.. స్వార్ధం.. కామం.. క్రోదం.. లోభం వంటి హానికారక క్రిములను.... మన మనసు పరిసరాలకు చేరకుండా జాగ్రత్త పడితే కలిగే ఆరోగ్యం మానసికంగా ఉపకరిస్తుంది....ఎన్నో మానసిక రోగాలకు మనసు కలుషితం కావడమే ముఖ్య కారణంగా నేను భావిస్తున్నాను.... మనసుని నిష్కల్మషంగా ఉంచుకోండి - ఆరోగ్యవంతులు కండి.... - విశ్వ.
200)అటక ఎక్కడానికి మనం నిచ్చెన వేస్తాం. ఆ నిచ్చెన తొలి మెట్టు ఎక్కగానే అటక చేరలేం. అన్ని మెట్లు ఎక్కాల్సిందే. అలాగే మానవ ప్రయత్నాలు కూడా. ఒకటి ప్రయత్నించి  ఫలితం రాకపోతే  దానిని మధ్యలోనే  విరమించకూడదు. మరో ప్రయత్నం చేయాలి. అప్పుడే గమ్యం చేరుకోగలం ..కాబట్టి మనిషి తను అనుకున్న గమ్యాన్ని చేరాలంటే నిరంతర సాధనతో పాటు సాధించాలనే తపన ,కఠోర దీక్ష ఎంతో అవసరం  - రఘు
201)పేరు ప్రతిష్ట కోసం లక్షలు కర్చు చేయటం కన్నా ప్రేమ నిజాయితిలతో పెట్టె పిడికెడు అన్నం ఎంతో గొప్పది - రఘు
202)పుట్టుకతో భోగి అయినవాడు కూడా రోగాల పాలుకాగలడు.పుట్టుకతో రోగి అయినవాడు తరువాత భోగాలను అనుభవించగలడు ..కాబట్టి సుఖమనేది ఏ ఒక్కరి సొత్తు కాదు,అలాగని దుఖం అనేది ఎవరినో ఒకర్ని పట్టుకొని జీవితాంతం పీడించదు..ఇది అర్ధం చేసుకున్నవాడి దగ్గరకి  దుఖం దరిదాపుల్లోకి కూడా రాలేదు. - రఘు
203)మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. సహాయము ఎక్కడనుంచో రాదు. అది మనలోనుండే ఉద్భవించాలి. మనకుమనమే నిజమైన సహాయము చేసుకోగలము. మనకుమనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు. మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది.  - రఘు
204)మనిషి ఉన్నతికి అతని పనులే కారణం. అతని అభివృద్దికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం.మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును.  - రఘు
205)ఒక అవకాశం చేజారిపోతే కళ్ళ నీళ్లు పెట్టుకోకు, మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడు - రఘు
206)ప్రతి మనిషి తనకు ఉన్నంతలో సమాజంలోనివారికి ఏదో ఒక సహాయం చెయ్యగలగాలి , ఎంతో కొంత ఇవ్వగలగాలనుకోవడం అసలైన సంపదకు ఆనవాలమవుతుంది. వస్తూ తాను తెచ్చిందేమీ లేదని వెళ్తూ తాను తీసుకెళ్లగలిగేది ఏమీ వుండదని తన పని తాను శక్తివంచన లేకుండా చేస్తూ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఆ దిశలో అడుగులు వేస్తూ, ఆలోచిస్తూ ఆరాధిస్తూ.. ముందడుగు వెయ్యగలిగితే ఊహకైనా అందని రీతిలో అసలు సంపద చేకూరి జీవితానికో సార్థకత ఏర్పడుతుంది.  - రఘు
207)ఇతరులలో మంచిని చూడకపోవడం మనలో మంచితనం లేకపోవడాన్నే సూచిస్తుంది.  కాబట్టి ప్రతి ఒక్కరిలో మంచినే చూడడానికి ప్రయత్నం చెయ్యండి  - రఘు
208)ఒక మనిషి విజయం సాధించడానికి ప్రతిభ అనేది ఒక్క శాతం అయితే తొంబై తొమ్మిది శాతం నిరంతర కృషి...కాబట్టి కృషి లేనిదే విజయం రాదు  - రఘు
209)నీవు బయపడే పనులను మరల మరలా చేయటం ద్వారా నీలో కొంచెము కొంచెముగా భయము పోయి దైర్యము పెరుగుతుంది. ఎప్పుడు ఆనందముగా ఉండటానికి, నీగురించి నీవు సంతృప్తిగా ఉండటానికి ప్రాదాన్యత ఇవ్వాలి.  నీవు తలపెట్టి చిత్తశుద్ది తో చేస్తే ఎటువంటి పనినైనా చేయగలవు అనే విషయాన్ని నీకు నీవే పదే పదే చెప్పుకోవాలి. అప్పుడు మనకు ఆ పని చేయటానికి కావలసిన శక్తి వచ్చి భయం తొలిగి ఏ పనినైనా చేయగలిగేలా చేస్తుంది  - రఘు
210)అసత్యానికెప్పుడూ అపజయం తప్పదు , విజయం సదా సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది .కాబట్టి ప్రతి ఒక్కరు విజయం సాధించాలంటే సత్యంతో,ధర్మంతో ముందుకు నడవాలి. - రఘు
211)మనిషికి ఉన్న ఉత్తమ సంపదలో దయ మొట్టమొదటిది. మనిషి ఎప్పుడు ఆర్తులయందు ఆదరణ , పేదలయందు దయ, దీనులయందు దాతృ స్వభావం, కష్టాలలోబాధపడేవారిపై కరుణ ఇలాంటి పరోపకార బుద్ధితో కూడిన సహృదయం కలవాడై ఉండాలి. మానవుడు తన హృదయాన్ని దైవ సంపదతో నింపుకొని దైవ నిలయంగా తీర్చిదిద్దుకోవటమే లక్ష్యం కావాలి.  - రఘు
212) జీవితం గెలుపు,ఓటముల ఆట...దీనిని నాటకమని భావించి నటిస్తే సదా సంతోషంగా ఉంటారు - రఘు
213)మనిషికి ఉన్న ఉత్తమ సంపదలో దయ మొట్టమొదటిది. మనిషి ఎప్పుడు ఆర్తులయందు ఆదరణ , పేదలయందు దయ, దీనులయందు దాతృ స్వభావం, కష్టాలలోబాధపడేవారిపై కరుణ ఇలాంటి పరోపకార బుద్ధితో కూడిన సహృదయం కలవాడై ఉండాలి. మానవుడు తన హృదయాన్ని దైవ సంపదతో నింపుకొని దైవ నిలయంగా తీర్చిదిద్దుకోవటమే లక్ష్యం కావాలి.  - రఘు
214)చదరంగంలో మాదిరిగానే జీవితంలో కూడా ముందుచూపు ఎంతో అవసరం - రఘు
215)నలుగురికీ మేలు చేయాలనే సత్సంకల్పం, తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నదానిలోనే నలుగురికి పెడుతూ, సత్యవాక్కుతో, దీక్షతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో జీవించడం అనేవి మంచి లక్షణాలు . సంఘ శ్రేయస్సుకూ, వ్యక్తి వికాసానికీ పనికివచ్చే ఈ మంచి లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండాల్సినవి...ఇవి సదా ఆచరణీయం . - రఘు
216)మంచి లక్షణాలు మనసుకు ప్రశాంతతను కూర్చి ఆశావాదాన్ని కల్గించడానికి దోహదపడతాయి .ఎప్పుడైతే మనిషిలో ఆశావాదం ప్రభవించిందో, అప్పుడే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఒక్కసారి మనిషిలో ఆత్మ విశ్వాసమేర్పడిందంటే అతనింక అద్భుతాలనే సృష్టించగల్గుతాడు, దురదృష్టాల్ని సైతం అదృష్టాలుగా మలచుకునే శక్తిని సంపాదించుకోగల్గుతాడు.అప్పుడిక భవిష్యత్తుపై భయపడకుండా ప్రతి పనినీ తానే చేపట్టగల్గుతాడు. అంతవరకూ- గడిచిన నిరాశా జీవనం అన్నీ క్రమక్రమంగా ఆనందమయంగాను, ఆశల హరివిల్లుగాను పరివర్తనం చెందుతాయి. అప్పుడిక మనిషి జీవితం- నిత్య సుఖ సంతోషాల ఆనంద నిలయమే మరి. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి లక్షణాలను అలవరచుకోవాలి. - రఘు
217)నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు ,దురలవాట్లు ,అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు.వాటిని జయించటానికి తాను కష్టమైన మార్పు పొందే ప్రక్రియను చేపట్టాలి.ఆ మార్పును పొందటానికి తాను నిరంతరం మానసిక శక్తిని ఉత్తేజ పరచుకోవాలి.తనకు ఎదురైన కష్టాలను, విమర్శలను తాను పైకి ఎక్కటానికి ఉపయోగపడే నిచ్చెనగా మార్చుకొని ఎదుగుతూ సాగాలి.అనుక్షణం తనతో తాను పోరాడాలి,బలపడాలి,సాధించాలి - రఘు
218)బలమైన బలహీనతలను అధిగమిస్తూ, బలమైన బలాలపట్ల అచంచలమైన విశ్వాసం కలవారే జీవితంలోని మధురానుభూతుల్ని స్వంతం చేసుకోగలుగుతారు.  - రఘు
219)మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్యఫలం ఒక్కొక్కసారి మనం చేసే చెడ్డ పనుల వల్ల తన శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై మనిషిని కష్టాలుపాలు చేస్తుంది. మనిషి స్వర్గసుఖాలని సిరిసంపదలను, భోగభాగ్యాలను అనుభవిస్తూ ఆదమరిచి పుణ్యకార్యాలను చేయడం మానుకొంటే , తాను నిలువ వుంచుకొన్న పుణ్యఫలం కాస్త హరించుకొనిపోయి తిరిగి మనిషి కష్టాలు పాలవుతాడు. దానికై మనిషి పాపకర్మలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని ఫలితం ఎలా ఉంటుంది? అది మనల్ని ఎలా వెంబడిస్తుందనే విజ్ఞత ప్రదర్శించిన వాడు  సుఖ సంతోషాలతో సాఫీగా జీవితం గడపగలడు - రఘు "
220)కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం.కృషి చేస్తే అసాధ్యం వుండదు,వ్యవసాయం చేస్తే కరువుండదు, తపస్సు చేస్తే పాపముండదు, మౌనంగా ఉంటే దెబ్బలాట ఉండదు, జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు., వీటన్నిటికి కృషి ఉండాలి,కాబట్టి ""కృషి"" చేయనిదే ఏదీ కూడా సిద్ధించదు - రఘు"
221)మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే  అది మనల్ని కాదు,మనం సాధిస్తున్న విజయాలను కీర్తిస్తున్నారని గుర్తించాలి.మనల్ని ఎవరైనా విమర్శిస్తుంటే అది మనల్ని కాదు మన వైఫల్యాలని గుర్తించాలి.మన మనస్సుని వైఫల్యాలకి అతీతంగా పని చేసే స్థితికి ఎప్పుడూ తీసుకేల్తామో అప్పుడే నిజమైన  గెలుపని అర్ధం - రఘు "
222)జీవితంలో ఒకసారి పోతే తిరిగి రాని నాలుగు అంశాలు : కాలం,మాట,అవకాశం, ప్రాణం. జీవితంలో ఏ నాడు కోల్పోకూడని నాలుగు అంశాలు : శాంతి,ఆశ,నిజాయితి, ఆశయం. జీవితంలో అత్యంత విలువైన నాలుగు అంశాలు : ప్రేమ,విశ్వాసం,నమ్మకం, మానవత్వం. జీవితంలో స్థిరంగా ఉండే నాలుగు అంశాలు : మార్పు,మరణం,దైవం, మాతృ ప్రేమ. జీవితంలో వ్యక్తిని నిర్మించే ప్రధానమైన నాలుగు అంశాలు : శ్రమ, చిత్తశుద్ధి,పట్టుదల, సంకల్పం. జీవితంలో వ్యక్తి పతనాన్ని శాసించే నాలుగు అంశాలు : కామం,గర్వం,కోపం, స్వార్ధం. - రఘు"
223)పరచింతన పతనానికి మూలము...స్వచింతన స్వర్గానికి సోపానము - రఘు
224)జీవితం ఏ ఆటంకం లేకుండా సాఫీగా, ప్రశాంతంగా సాగుతున్నంతసేపు, కష్టాలు తన దరిదాపుల్లోకి రానంతసేపు మనిషి దేనిని గురించి కూడా ఆలోచించడు. అదే అనుకోకుండా ఏదైనా ప్రమాదంగాని, చేస్తున్న పనిలో ఆటంకంగాని, అకస్మాత్తుగా జబ్బుపడడం లాంటిది జరగగానే అది నా కర్మ! నా కర్మ అట్లా కాలింది, దానికి ఎవ్వరు ఏమి చేస్తారు అని దిగులుపడతారు .కాబట్టి  కర్మ చేయడమే నీ వంతు. కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. ఫలమేదో దక్కుతుందని మాత్రం పనిచేయడం తగదు. అలా అని అసలు పని చేయకుండా ఉండడం మహాపాపం. - రఘు
225)అపజయాన్ని తలుచుకుంటూ దుఃఖించేవాడు ఎప్పటికీ ఏడుపులోనే ఉంటాడు తప్ప విజేత కాలేడు. ఇలాంటివాడికి ప్రయత్నాలే తప్ప ఫలితాలు రావు. దుఃఖాన్ని ఛేదించి ముందడుగువేసి శ్రమించినవాడు గత అపజయాల ఛాయలు కూడా కనపడని అత్యున్నత విజయ సౌధాలను నిర్మించి సుఖిస్తాడు. ఇది జీవన సత్యం. - రఘు
226)ఆరుంగుళాల నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ..ఆరుఅడుగుల శరీరం ఇబ్బందులకు గురవుతుంది. - రఘు
227)మనిషి ప్రతి అవకాశంలో ఒక  సమస్యని వెతికేకంటే ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని వెతుక్కునే వాడికి విజయం తధ్యం  - రఘు
228)నీ దగ్గర ఉన్న అపూరూపమైనదాన్ని అందరికీ ఇవ్వడానికి నువ్వు సిద్దపడితే ,అందరి దగ్గర నుంచి కూడా ఆ అపూరూపమైన ఫలితమే నీకు దక్కుతుంది  - రఘు
229)గెలుపంటే ఇతరుల కన్నా నువ్వు గొప్పవాడివి అవ్వడం కాదు.నిన్నటి "నువ్వు" కన్నా ఈ రోజు "నువ్వు" బాగుండడం - రఘు
230)చెయ్యడానికొక పని,ప్రేమించడానికొక మనిషి,జీవించడానికొక ఆశ,పై మూడూ ఉన్నావాళ్ళు జీవితంలో నిత్యం సంతోషంగా ఉంటారు. - రఘు
231)నేర్చుకున్నాము అనే అహం కన్నా...తెల్సుకోవాలి అని ఆసక్తి చాల గొప్పది - రఘు
232)ఇతరుల పొరపాట్లను క్షమించటం మరియు మర్చిపోవటమే సహనశీలత - రఘు
233)ఆచరణకు నోచుకోని కోటి మాటలకన్నా తక్షణం చెయ్యగలిగే చిన్న పని ఎంతో మిన్న!! కాబట్టి ఎవరైతే మాటలలో చెప్పక చేతల్లో చూపించాగాలరో వారి యొక్క జీవితంలో ముసురుకున్న చీకట్లను దూరం చేసే వెలుగురేఖగా మారగలరు - రఘు
234)దయ కలిగిన మనసులో మంచి మర్యాదలకుగాని, ప్రేమానురాగాలకుగాని లోటుండదు .దయ కలిగిన మనసు దైవసన్నిధికన్నా గొప్పది..కాబాట్టి ప్రతి ఒక్కరికి దయ అనే సద్గుణం కలిగి ఉండాలి  - రఘు
235)మనకు సంతోషం అనేది ఎదుటివాడి నవ్వులో నుండి వస్తుంది అంతే గని నువ్వు కర్చు పెట్టె డబ్బు నుండి కాదు...నలుగురితో నారాయణ అన్నట్లు నలుగురిలోనే ఉంది సంతోషం.... - రఘు
236)మనస్సును బట్టి ఆలోచనలు,ఆలోచనలు బట్టి పనులు,పనులుబట్టి విజయాలు,విజయాలను బట్టి వ్యక్తిత్వమూ  రూపుదిద్దుకుంటాయి.కాబట్టి ఎవరైతే మనస్సుని అధీనపరుచుకుంటారో  వారికి ఎటువంటి కార్యక్రమంలోయినా సరే విజయం తధ్యం !!! - రఘు
237)సత్వగుణం,సత్ర్పవర్తన ,సమర్ధత,భాద్యత,సేవాభావం,క్రమశిక్షణ,సృజనాత్మకత ,ప్రణాళిక ..ఇవన్ని మనిషి లక్ష్యం నేరవేరడానికి బలాన్నిస్తాయి కాబట్టి పై గుణాలన్నీ కలిగి ఉన్న వ్యక్తులకి విజయాన్ని దక్కించుకోవడం చాలా తేలిక !!! - రఘు "
238)ఏదైన పని ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి దానిని కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చెయ్యడానికి పట్టుదల ఉండాలి ఈ మూడు ఉండాలనుకుంటే మొహం మీద చిరునవ్వు ఎప్పుడు ఉండాలి.. కాబట్టి నవ్వుతు,ఆనందగా ఎ పనైనా ప్రారంభిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరగలవు - రఘు"
239)మనిషి ఎన్ని దానాలు చేస్తే అంతగా సంపన్నుడవుతాడు .అదే లోభంతో ప్రవర్తిస్తే మాత్రం అదే శత్రువై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది ..మంచి ప్రవర్తన ఆభరణంలా ఆదుకుంటుంది .సంతోషం ధనంలా ఉపయోగపడుతుంది..కనుక నీతి మార్గమే మనిషికి శ్రేయస్కరం.నీతిపధమే ఫలదాయకం.నీతితో కూడిన జీవనమే శాశ్వతం.అదే పరమార్ధం  - రఘు
240)తన తనువెల్లా  కరిగించి ,తన బిడ్డలకా వెలుగులు పంచి,చీకటిలో తను బ్రతుకుతూ వెలుగు మటుకే తన పిల్లలకు పంచుతూ ,చిరిగిపోతూ  చితికిపోతూ  చితిమంటల చిటపటలోకూడా "చిరంజీవ" అని దీవించేది అమ్మ మనస్సు మాత్రమే !!..అందుకే కదా అమ్మని  దైవంగా భావిస్తారు  - రఘు
241)కొంత మంది చిన్న విషయాన్నీ కూడా సమస్యగా మారుస్తుంటారు.దానివల్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా పట్టించుకోరు.కొంత మంది సాధ్యమైనంత వరకూ ఎటువంటి సమస్యలు సృష్టించకుండా తమ పనులను పూర్తిచేసుకుంటారు.పైగా ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి సహకరిస్తారు.కాబట్టి సమస్యలను సృష్టించే వ్యక్తిగా ఉండేకన్నా ,పరిష్కారాన్ని సాధించే శక్తిగా ఉండడం మంచిది.. - రఘు
242)మంచి మనసుతో శత్రువులను క్షమించినట్లుఐతే మంచి మిత్రులగా మారుతారు - రఘు
243)ఆలోచన అమృతంతో సమానం. ఆ ఆలోచన లేని మనిషి అన్ని విధాలా పతనమవుతాడు. - రఘు
244)చిన్న ఆశ సాధించగానే "హమ్మయ్య లక్ష్యం చేరేసాం" అనుకుంటే పొరపాటే..ఆ ఆశ ఆధారంగా చేసుకొని నిచ్చెన వేసుకొని మరింత ఎత్తుకి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి.కాబట్టి "ఒక చిన్న ఆశ పెద్ద విజయాలను చేకురిస్తుంది " - రఘు
245)మీకు తెలిసిన కళకి సంభందించిన మెళుకువలను మీ స్నేహితులతో పంచుకుంటే మీకు ఆ కళలో ఉన్న నైపుణ్యం ఏ మాత్రం తరగదు.పైగా మీ స్నేహితులతో కలిసి మరిన్ని మెళుకువలను తెలుసుకుని ఆ కళలో మరింత జ్ఞానాన్ని సంపాదించవచ్చు ..కాబట్టి మనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే మనకొచ్చే నష్టమేమి లేదు - రఘు
246)ద్వేషాన్ని ప్రేమగా,వైరాన్ని స్నేహంగా,అంధకారాన్ని ప్రకాశంగా పరివర్తన చెందుటే మానవత్వము - రఘు
247)కడివెడు పాలను పాడుచేసే ఒకే ఒక్క విషపు చుక్క కన్న, కొండంత దూదిని బూడిద చేసే ఒకే ఒక్క నిప్పు రవ్వకన్న, మనసుని కకావికలంచేసే అకారణ నిందకన్న, లేనిపోని అంచనాలు పెంచే ఒక్కగానొక్క భ్రమ ఎంతో ప్రమాదకరం..కాబట్టి ప్రతీ  ఒక్కరు భ్రమలు విడిచి  మనసుతో విని, మనసుతో చూచి ఆలోచించగలిగే వారికి ఎటువంటి ఊగిసలాటలకు తావు లేకుండా జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది  - రఘు
248)ఎవరు ఏ పని మొదలుపెట్టినా దానికి సంభదించిన మంచి చెడ్డలన్నింటీ ని ఆలోచింఛి సరైన సమయంలో సరైన పద్దతిలో ప్రారంభించాలి,అలా చేయనట్లైతే ఆ పని విజయవంతం కావడం అలా ఉంచితే ,మనకు భాద కలిగించే ఫలితాలే ఎక్కువ ఇస్తుంది,కాబట్టి,తెలివితక్కువగా మొదలుపెట్టే ఏ పనైనా సరే విచారకమైన ముగింపుకి దారి తీస్తుంది. - రఘు
249)విద్య పరమార్థం లోకహితం, సాటివాడికి తోడుపడని విద్య నిరర్థకం.కాబట్టి నీకు తెలిసిన విద్యని నలుగురితో పంచుకుంటేనే నువ్వు నేర్చుకున్న విద్యకి పరమార్ధం  - రఘు
250)తపోబలం, ధనబలం, భుజబలం, అధికార బలం, బంధుబలం-ఇలాంటి బలాలు ఎన్ని ఉన్నా, ధర్మబలం లేనప్పుడు  వ్యక్తులు లేక వ్యవస్థలు కూలిపోతాయి - రఘు
251)ఎండ కాయడం వెన్నల పూయడం, వాన కురవడం ప్రకృతి ధర్మాలు. ప్రకృతి తన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించకపోతే జీవరాశుల మనుగడకే ప్రమాదం. అలాగే సత్యవాక్పాలన, అహింస,పెద్దలను గౌరవించడం మొదలైనవి మానుష ధర్మాలు..ఇవి కూడా ప్రకృతి ధర్మాలాగే మనిషి ఈ ధర్మాలను  ఆచరించకపోతే అతని పురోగతికే  ప్రమాదం.కాబట్టి ప్రతి ఒక్కరు ధర్మ చరనలోనే నడవడానికి ప్రయత్నించాలి  - రఘు
252)మనిషికి వుండేటటువంటి సహజగుణం పదిమందిని అనుసరించడము. యితరులు ఏమిచేస్తే దానిని మనం గుడ్డిగా నమ్ముతాము. కానీ మన కలలు, మన భావాలు, మనం నమ్మిన సిద్ధాంతాలు పాటించి వాటిని ఆచరించి పరీక్షించినపుడుగాని మనకు మనపై విశ్వాసము, సంతృప్తి కలుగవు. అలాకాకుండా పదిమందిని అనుసరించి మన జీవితం గడిపితే చివరకు సరియైన ఫలితాలు సంతృప్తి రాక మనం చింతించవలసి వస్తుంది. అందుకే మన మనస్సు చెప్పింధే  ఎపుడూ అనుసరించాలి. - రఘు
253)క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి, ప్రోత్సహించి, ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి. - రఘు
254)ఇల్లు కలహంతోనూ, స్నేహం ఒక చెడు వాక్యంతోనూ, రాజ్యం ఒక చెడ్డ రాజుతోనూ, యశస్సు ఒక చెడు పని చేయటంతోనూ అంతరించిపోతాయి .కాబట్టి ప్రతి ఒక్కరు జీవితానికి  కళంకం అంటకుండా వ్యవహరించడం నేర్చుకోవాలి  - రఘు
255)ఒక మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవటం ఒక ఎతె్తైతే, ఆ స్నేహాన్ని నిలుపుకోవటం దానిని మించినది.స్నేహాన్ని వంచనా స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం ప్రారంభిస్తే అక్కడితో ఆ స్నేహమే అంతరిస్తుంది. కాబట్టి స్నేహనికియోక్క విలువ తెలుసుకొనిమసలడం ఎంతో అవసరం  - రఘు
256)ఆనందానికి ఆధారం - సంతృప్తి...వేదనకు మూలం - ఆరాటం - రఘు
257)సద్గుణాలను వీడకు ...అవగుణాలను దరికి రానీయకు. - రఘు
258)అందరూ నడిచినబాటలో నడవటం చాలాతేలిక. మనము మనఆలోచనలను ఎక్కువగా ఉపయోగించవలసిన అవసరం లేదు. కానీ, అదేబాటలో మనం నడిచినప్పుడు క్రొత్త అనుభవాలు విజయాలు సాధించలేము. అందుకే మనము మన సొంతఆలోచనలను పద్ధతులను ఉపయోగించటం అలవాటుచేసుకోవాలి. ఒకసారి అలవాటు అయిన తరువాత అదే తేలిక అని అర్ధమౌతుంది - రఘు
259)మనస్సుకు ఆరోగ్యకరమైన, సృజనాత్మకమైన పనిని కల్పించాలి. దానికి ఉన్నతాదర్శాలనూ, ప్రేరణనూ అందించాలి. లేకపోతే మనసు హీనమైన విషయాలలోకి కొట్టుకుపోయి చెల్లాచెదరైపోతుంది. అటువంటి మనసుమీద మనకు పట్టు ఉండదు. కాబట్టి మనసును స్థిరపరచడానికి మన ఆలోచనాసరళిని మంచిగా పట్టుదలతో కాపలా కాయాలి. - రఘు
260)మనకు పరమ శత్రువైనా సరే ఎదురుగానున్నప్పుడు అతడిని ఆదరంతో ప్రేమతో పలకరిస్తే శత్రువులోనున్న శత్రుభావం నశించి మనకు మంచి స్నేహితుడౌతాడు - రఘు
261)కష్టాలలో వున్నవారిని దయతో చూచి- పలుకరించి- ఊరడించి వారి దుఃఖ కారణాలు తెలిసికొని వారికి తగినంత అంటే చేతనైనంత సాయం అందించాలి. ని, ఎదుటివారికి నేను ఉపకారం చేస్తున్నానన్న ఆలోచన నీకు రాకూడదు..ఇలా చేస్తూ పోయినప్పుడు నీవు కష్టాలలో ఉంటే దేవుడే నీకు సహాయం చేయగలడు  - రఘు
262)సమస్యలు లేని మనిషి భూమి మీద ఎక్కడా వుండడు. అయితే వచ్చిన, ఎదుర్కొన్న సమస్యని సున్నితంగా పరిష్కరించుకుని సరైన మార్గంలో ఆలోచించి మసలుకోవాలి. మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, ఎదుటివారిని సమస్యల్లో యిరికించి బాధపెట్టకూడదు - రఘు
263)తన మీద తనకు నమ్మకం లేనివాడు ఇతరులను ప్రేమించలేడు,గౌరవించలేడు - రఘు
264)కష్టాల నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అవి మనకంటే వేగంగా పరిగెత్తి ,తిరిగి మనకే ఎదురవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాలని ఒక అనుభవంగా భావించి ఎదురు తిరిగితే చెల్లా చెదురైపోతాయి  - రఘు
265)మేఘాలు తాము సంపాదించిన నీటిని వర్షించి ప్రాణులను బ్రతికిస్తున్నాయే గాని ,అవి తాగడం లేదు.చెట్లు సమృద్ధిగా పండించిన పండ్లను పరులకే దానం చేస్తున్నాయి.కాని,అవి తినడం లేదు..అలాగే ప్రతి ఒక్కరు పరోపకారం చేస్తూ జీవించాలేగాని స్వార్ధంతో ఉండకూడదు.కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు త్యాగగుణాన్ని అవవర్చుకోవాలి అప్పుడే జీవితంలో సంతృప్తి మిగులుతుంది  - రఘు
266)సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించే నేర్పు మనసుకు కలిగితే- మానవ జీవితం సార్థకమవుతుంది - రఘు
267)జగత్తును ధరించునదే ధర్మము. ‘యతో ధర్మస్తతో జయః’- ధర్మము ఎక్కడ వుండునో అక్కడ విజయము లభించును. ‘్ధర్మో రక్షతి రక్షితః’ ధర్మమును రక్షించినప్పుడే ధర్మము మనలను రక్షిస్తుంది. ‘సత్యాన్నాప్తి పరో ధర్మః’ ఇటువంటి ధర్మమునకు సత్యమే ఆధారము...కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లక్షణాలు అలవర్చుకోవాలి  - రఘు
268)పర్వతం ఎత్తు చూసి జంకితే.. శాశ్వితంగా కిందనే  ఉంటావు .. సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే.. శిఖరాగ్రం మీదనే. ఉంటావని గుర్తుంచుకో  - రఘు
269) ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు. ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే. - రఘు
270)మనిషి మాట తూలాడంటే- మర్యాద పోగొట్టుకొన్నట్టే! ఎందుకంటే- కాలుజారితే తీసుకోగలము కాని, మాట జారితే వెనక్కు తీసుకోలేము. కనుక, మాట మనిషిని ఒప్పించేదిగానే ఉండాలి. మనిషికి నొప్పి కలిగించేదిగా ఉండకూడదు.ఎందుకంటే మాటలు ముత్యాల మూటలైతే మనిషి జగతినే జయించగలడు .కాబట్టి ప్రతి ఒక్కరు మాటలు ఆచితూచి మాట్లాడాలి  - రఘు
271)మానవ జన్మ అరుదుగా లభించే జన్మ. ఎప్పటికీ మనిషి తిరిగి మనిషిగానే పుడతాడని ఖచ్చితంగా చెప్పలేనిది. బ్రతుకును తీర్చిదిద్దుకునే అవకాశమున్నది మానవజన్మలోనే! అందువల్ల అజ్ఞానం అంతం చేసుకుని జీవిత విలువలను తెలుసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు.. వాటిని వంట పట్టించుకుని సక్రమంగా వినియోగించుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మానవ జన్మకు న్యాయం చేకూర్చినవారై సమాజంలో విలువున్న మనిషిగా గుర్తించబడడమేగాక భగవంతుని దృష్టిలోనూ పడి ధన్యులవుతాము  - రఘు
272)ఇతరుల కోసం గోతులు త్రవ్వితే ముందు వాటిలో మనమే పడవచ్చునన్న విషయం మరువరాదు.కాబట్టి నువ్వు పరులకు ఉపకారం చెయ్యకపోయినా అపకారం మటుకు తలపెట్టకు  - రఘు
273)తృప్తిగలవాడికి ఆరోగ్యం లభిస్తుంది .అసంతృప్తితో ఉన్నవాడికి  ఆరోగ్యం నశిస్తుంది .ఏమీలేదని ఎల్లప్పుడూ  మనస్సులో వెలితిని నింపుకుంటే మనిషికి ఏమి మిగలకుండా పోతుంది .కాబట్టి మనిషి ఎప్పుడు నిత్యతృప్తితో ఉండడం ఎంతో మంచిది."నేను ఎంతో బాగున్నాను.నాకేమి తక్కువ లేదు " అనుకునే మనిషి నూరేళ్ళు సంపూర్ణంగా బ్రతకగలదు  - రఘు
274)నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి, మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్దంగా ఉంటారు.కాబట్టి పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు వినాలి అంతేగాని పెడచెవిపెడితే  జీవితంలో అందరి చేత మాట పడాలి  - రఘు
275)ఎవరినీ ద్వేషించకుండా ఉండటం,అందరి పై కరుణ చూపటం,కోపహంకారాలు త్యజింటం,నిత్య సంతుష్టులై జీవించటం,పవిత్ర జీవనం గడపటం అనేవి మంచి లక్షణాలని పెద్దలు చెప్పారు...ఇవి అవపోసన చేసుకుని ఈ మార్గంలో ఎవరరైతే నడవ గలరో వారు జీవితంలో దేనినైనా సాధించగలరు  - రఘు
276)త్యాగం ఒక సుగుణం. త్యాగం చేయడంమంటే మనకున్న దాన్ని లేకుండా చేసుకోవడం కాదు. ఉన్నదానిలో మరొకరికి సాయంచేయడమే. ఈ త్యాగగుణంలో  ఆర్భాటాలకు తావుండకూడదు. ఎందుకంటే అది గర్వం పెరగడానికి పనికివస్తుంది కాని త్యాగగుణాన్నిపెంచదు. కనుకనే కర్ణుడు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనవసరం లేదంటాడు. అలాంటిగుణసంపత్తి పెంచి పోషించుకోవాలి. - రఘు
277)రావట్లేదు కదా అని కూర్చుంటే ఎప్పటికి ఏది రాదు,ఇది నేను చెయ్యగలను అని గట్టి నమ్మకం పట్టుదల ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు - రఘు
278)ఏదో ఒకదాన్లో విఫలమైనంత మాత్రాన ఎందుకూ మనము ఎందుకు పనికిరామని అనుకోకూడదు . దిగులు చెంది ఆలోచనలు చిదిమేయవద్దు . అన్ని ప్రయోగాలూ ఒక ప్రయత్నంలోనే ఫలించవు. ఎన్నో ప్రయోగాల అనంతరమే ఐన్‌స్టీన్‌, ఎడిసన్‌ వంటివారికి విజయాలు వరించాయి. వారి ముందు మనమెంత? మన ప్రయత్నాలెంత? అలాంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అడుగు ముందుకేయాలి. మొదటి ప్రయత్నంలోనే గెలుపు సాధించడానికి మనకేమీ అతీంద్రియ శక్తులు దేవుడు ఇవ్వ లేదు . పసిపాప నడక నేర్వడానికి ముందు ఎన్నోసార్లు పడిపోతారు . అయినా విసుగెత్తక వారు నడిచేవరకూ ప్రయత్నిస్తూనే వుంటారు . పడ్డాను కదాని కూర్చుంటే ఆ నడక సాధ్యమేనా! అది చాలదూ మనకు జీవితపాఠం నేర్వడానికి! చిన్న చిన్న దెబ్బలకే నిరాశకు గురై ఆత్మవిశ్వాసం కోల్పోయేవారు ఈ వాస్తవం తెలుసుకోవాలి. ఒకసారి విఫలమైతే జీవితం అంతమైపోదు. ఒకసారి అడుగు తడబడితే బతుకేమీ నాశనమైపోలేదు. కాబట్టి . 'కృషితో నాస్తి దుర్భిక్షం'! ఈ మంత్రాలు చాలవూ గెలుపుబాట పట్టడానికి! - రఘు
279)అన్యాయాన్ని ఎదుర్కోడానికి కావల్సింది విలువలపట్ల గౌరవం, పరిస్థితుల పట్ల అవగాహన, తీరుతెన్నులపట్ల సరైన దృక్పథం, సమాజాన్ని మార్చాలనే దృఢసంకల్పం, ప్రశ్నించే తత్వం, సాధించగలమనే విశ్వాసం. ఈ భావాలన్నీ మనలో వుంటాయి. అయితే, కొన్ని అడుగంటిపోయాయి. ఇంకొన్ని జీవం కోల్పోయాయి. ఇంకొన్ని నిర్లిప్తతలో పడి కొట్టుకుపోతున్నాయి. మనం చేయాల్సింది వాటిని కూడగట్టుకోవడం. తిరిగి శక్తి పుంజుకోవడం!ఈ స్పందన మనకు అవసరం. ఇది ఒకరోజు కాదు, నిరంతరం సాగాలి. ఈ స్ఫూర్తి ఎల్లప్పుడూ వుండాలి. అన్యాయాన్ని అడ్డుకోవడానికి, అక్రమాలను నిలదీయడానికి, ఆవేదన వ్యక్తం చేయడానికి, అడ్డుగోడలను ఛేదించడానికి స్పందన అవసరం. మనిషిగా నిరూపించుకోడానికి, మనమంతా ఒకటని చాటడానికి స్పందన అవసరం. ఇదే ప్రగతికి నిదర్శనం. పురోగతికి తార్కణం.  - రఘు
280)మనిషి ఏరంగంలో అభివృద్ధిని సాధించాలన్నా మనస్సును స్వాధీనం చేసుకోవడం అవసరం. మనస్సు స్వాదీనమైనవాడు  ప్రతికూల పరిస్థితులలో కూడా విజయం సాధించగలడు , స్వాధీనమైన మానసిక పరిస్థితి ప్రశాంతతకు, ఆ ప్రశాంతత మనశ్శాంతికి దారితీస్తుంది. మనశ్శాంతి ఆనందానికి దారితీస్తుంది. సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులనుకూడా సంతోషపరచగలుగుతాడు. జీవితంలోని బాధల్ని జయించటానికి, ఎదుర్కోవడానికి కావలసిన పూర్తి ధైర్యం, శక్తి కలుగుతుంది. అప్పుడే అతని జీవితంలో ఆనందం, సంస్కృతి, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలు, మానవ సంబంధాలతో వెలుగులు నింపుతాయి..అందుకే పెద్దలు ‘‘సర్వే మనో నిగ్రహ లక్షణాం తాః" అని అన్నారు - రఘు
281)జీవితంలో  జరిగే ఏ చిన్న విషయానికైనా ,సంఘటనకైనా ఆలోచనలే మూల కారణం .అది మంచి విషయం  కావచ్చు,చెడు విషయం కావచ్చు.మన జీవితాన్ని శాసించే శక్తి ఆ దేవుడి తర్వాత ఒక్క ఆలోచనలకే వుంది .చిమ్మ చీకటిలో ఒక మైనపువొత్తి ఎలా వెలుగు చూపుతుందో అలాగే ఆలోచనలు కూడా మనిషి జీవనయానానికి దారి చూపుతాయి.మంచి ఆలోచనలు మంచి మార్గంవైపు నడిపిస్తే,చెడు ఆలోచనలు వారిని ఉన్మాదం వైపు నడిపిస్తాయి.ఆలోచనలు మన జీవనసూచికలు.అందుకే సాధ్యమైనంతవరకు మంచి ఆలోచనలు చేస్తే మనస్సుకీ,శరీరానికీ జీవితంలో ఎదుగుదలకి ఎంతో ఉపకరిస్తాయి - రఘు
282)విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానము, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారము సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. సమాజంలో విద్య కలిగినవాడు ధనవంతుని కన్నా గొప్పవాడని , సంఘంలో గొప్పవాడని, ఎక్కడివెళ్లినా బతకకలుగుతాడని పెద్దలు చెప్పారు - రఘు
283)గొప్ప బ్రతుకు అంటే ప్రపంచమంతా ఆస్తులు విస్తరింపజేసుకొని ,గ్రహమండలాల్లోకి కూడా వెళ్లి సూర్యున్ని,చంద్రుణ్ణి వేలంపాటల్లో కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవడం కాదు,గొప్ప బ్రతుకు అంటే గొప్పగా బ్రతకడం. మరణంలో కూడా ఎవరికైనా సహాయం చేసే అవకాశందొరుకుతుందా ఎదురుచూడడం ,సహాయం చేయడం ద్వారా లభించే నిర్మలమైన కీర్తి ,కూడబెట్టడం,కుప్పపోయడంలో ఆవగింజైనా దొరకదు. అందుకే " పరోపకారర్దాయ మిధం శరీరం " అన్నారు పెద్దలు - రఘు
284)తృప్తికి మించిన సంపద లేదు. తృప్తి అనేది కేవలం సంపదలోనే లేదు. ఎంత సంపాదించినా సరే మనసులో తృప్తి అనే భావం లేకపోతే ఆ వ్యక్తి జీవితమంతా చిల్లుపడిన కుండలాంటిదే. పంచభక్ష్యాలను అసంతృప్తిగా భుజించుటకంటే తృప్తిగా నాలుగు పచ్చడి మెతుకులు తిన్నా చాలు. - రఘు
285)మనకున్న సంపదతో తృప్తి పడవచ్చు కానీ..మనకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు - రఘు
286)జీవితంలో గెలుపు చివరిది కాదు,ఓటమి శాశ్వతము కాదు,ఈ రెండిటి మధ్య చిన్నపొర ఉంటుంది . ఈ పొరె శాశ్వతం అనుకోని భాదపడకూడదు , ప్రయత్నం ఆపకూడదు గెలిచెవరకు పోరాడాలి,పోరాడి సాధించాలి. ఇదే గెలిచేవాడికి ఓడిపోయేవాడికి తేడా !! ఈ తేడా తెలుసుకున్నవాడికి విజయం తద్యం - రఘు
287)నాది నాది అంటే కిరాయితనం ...మాది మాది అంటే పరాయితనం ..మనది మనందరిది అంటే మనతనం మంచితనం - రఘు
288)విజయం ముగింపు కాదు..పరాజయం శాశ్వతం కాదు - రఘు
289)జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమని భావిస్తారు. అవి అవసరమే, కాని, వాటిని మాత్రమే సాధించడం ఘనవిజయంగా భావించడం సముచితం కాదు. మన తెలుగు సినిమాలో చెప్పినట్లు డబ్బువల్ల హంసతూలికా తల్పం కొనవచ్చు కాని నిద్రను కొనలేం.ఆహారం కోకొల్లలుగా కొనవచ్చు కాని ఆకలిని కొనలేం,ఎన్నో అంతస్తుల మేడ కొనవచ్చు కాని శాంతిధామాన్ని కొనలేం , మందులు కొనవచ్చు కాని ఆరోగ్యం కొనలేం , విలాసంగా బ్రతకడం నేర్చుకోవచ్చు కాని సంస్కారం, సంస్కృతి అనేవి పెద్దవాళ్ళపెంపకంలోంచి వచ్చేవి కాని బయట అంగట్లో దొరకేవీ కావు . మనిషి కేవలం ఆహారం తిని మాత్రమే బతకలేరడు . అతనికి నలుగురి కావాలి. సువిశాలమైన అనంత ప్రపంచంలోని మహోత్కృష్ట కాంతివైపు తలుపులు మూసి వేసి, వెలుగు అనుకుంటున్న చీకటి నిశ్శబ్దంలో తనను బంధించుకున్న వ్యక్తి నిజమైన ఆనంద సముద్రాలను ఏనాటికీ చూడలేడు. కాబట్టి జీవితాన్ని అలౌకిక విజయంగా భావించి, ఆదర్శశిఖరాల్లో ఆశయదీప్తితో జీవించడానికి మించిన విజయం ఇంకోటి లేదు. - రఘు "
290)పడిపోతాను అని భయపడి కూర్చునే ఉంటె నడవటం తెలియదు ఓడిపోతను అని భయపడి ప్రయత్నించటం మానేస్తే గెలుపే తెలియదు ఫలితాన్ని నువ్వు నిర్నయించకు నీ ప్రయత్నం నిర్ణయిస్తుంది. - రఘు"
291)మనస్సు మహా టక్కరి . దీనిని అదుపులో పెట్టుకుంటే సేవకుడిలా పని చేస్తుంది . అదే నెత్తికెక్కించుకుంటే  అది యజమానిలా అధికారం చెలాయిస్తుంది కాబట్టి మనస్సుని అధీనపరుచుకున్నవాడికి విజయం అన్ని వేళలా వరిస్తుంది  - రఘు
292)ఆశావాదంతో ఆలోచిస్తే,,ప్రతి సమస్యా ఓ మంచి అవకాశంలా అనిపిస్తుంది. అదే ,నిరాశావాదంతో ఆలోచిస్తే అది పెద్ద సావాలై బెదిరిస్తుంది కాబట్టి నీవు ఎప్పుడు ఆశావాదంతో,ఆత్మవిశ్వాసంతో జీవించు నీకు ఏది సమస్య అనిపించదు  - రఘు
293)మన మనసు మన చుట్టూ ఉండే వస్తువులమీద, వ్యక్తులమీద లగ్నమవుతుంది. ఆ వస్తువులలో ఉండే ఆకర్షణలు మనసును ప్రలోభపెట్టి మనల్ని ఆయా వస్తువులకు బానిసలుగా మారుస్తాయి. మనం వాటికి లొంగకుండా ఉండాలంటే మనసుపై పూర్తి పట్టు సాధించాలి. మనసుని నిగ్రహించుకోవాలంటే సంకల్ప శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సంకల్ప శక్తి కలిగినవారు అనుకున్న కార్యంలో తప్పక విజయాన్ని సాధిస్తారు. - రఘు
294)కష్టకాలంలో మనలను ఆదుకునేవాడు స్నేహితుడు. కపటము, స్వార్థములేని మైత్రి ఒక దివ్యానుభవం. స్నేహబంధం కంటే తీయనిది ప్రపంచంలో మరొకటి లేదనడంలో అతిసియోక్తి ఏమి కాదు  - రఘు
295)మనస్పూర్తిగా నవ్వుకోవడానికి మంచి వాతావరణం , మంచి స్నేహితులు ఉండాలి...స్వార్హ్తం లేని మంచి వ్యక్తుల సాన్నిహిత్యం అన్నింటికన్నా గొప్ప సంతోషాన్నిస్తుంది...ఎంత సంపాదించాం అనేదానికన్న ఎంత సంతోషంగా ఉన్నాము,ఎన్ని మంచి పనులు చేసాము అనేదే చాలా చలా సార్లు గుర్తుకు వస్తాయ్...ఎంత బిజీగా ఉన్నా కూడ అప్పుడప్పుడు నీకోసం నీవు బతకడానికి ప్రయత్నించు అవే మనం చేసే మంచి పనులలో ఉండే సంత్రుప్తి అదే...పిల్లా, జేల్ల, ఇల్లు, సంసారం, డబ్బు, హోదా ఇవన్నిటికన్న మించినది అదే అని నా నమ్మకము - రఘు
296)ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ ,మిత్రులు కానీ ఉండరు . నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ  సంపాదించి పెడుతుంది .కాబట్టి నీ నడవడిక,నీ వ్యక్తిత్వం పైనే నీ జీవితం ఆధారపడుతుంది  - రఘు
297)శాంతితో సమానమైన తపస్సు మరొకటి లేదు,సంతోషాన్ని మించిన శ్రేష్టమైన సుఖం మరొకటి ఉండదు,దయకు మించిన ఉత్తమ ధర్మం,సహనానికి మించిన ఆభరణం ,ఆశకు మించిన వ్యాధి మరొకటిలేదు  - రఘు
298)ఏ కష్టం వెనుక ఏ సుఖముందో ......ఏ శాపం వెనుక ఏ వరముందో ..  ఎవరికి తెలుసు ? కాబట్టి సమస్య వచ్చినప్పుడు మన శాయశక్తులా చెయ్యగలిగినంతా చేసి.. ఇక దైవం పైన భారం వేసి ఏది ఎలా జరిగినా.. అంతా మన మంచికే అని నిబ్బరంగా ఉండగలగాలి. అప్పుడు  మనశ్శాంతి..సుఖం దానంతట అవే వస్తాయి  - రఘు
299)ప్రతిమనిషిలోనూ ఎంతోకొంత అహంకారం అనేది వుంటూ వుంటుంది. కాని అది అంతమంచిది కాదు. అహంకారం వల్ల నష్టాలే కాని లాభం అంటూ ఏమీ వుండదు.అహంకారం వల్ల మనకు ఏమీ తెలియక పోయినా అన్ని తెలిసినట్లుగా ప్రవర్తించటం జరుగుతుంది. ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి. మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారికి చాలా అవసరం. - రఘు
300)మనమెట్లా చూస్తే జీవితం అట్లా వుంటుంది. తెల్లని పూలతో కళకలాడే గులాబీ మొక్కని చూసినప్పుడు  పూలతో బాటు ముళ్ళు కూడా వుంటాయి. పూలని చూడాలా? ముళ్ళని చూడాలా అన్నది మన చేతుల్లో వుంది. మన దృష్టిని బట్టి జీవితం మారుతుంది. మనోహరంగా వుందనుకుంటే ఆనందాన్ని పంచుతుంది. బాధతో నిండి వుందనుకుంటే బాధను యిస్తుంది. జీవితం అద్దంలాంటిది. నువ్వు నవ్వుతూ అద్దంలోకి చూస్తే నవ్వు ముఖంతో వుంటావు. ఏడుస్తూ చూస్తే ఏడుస్తూ కనిపిస్తావు.మనిషి గాఢంగా జీవించాలి. జీవితాన్ని రసభరితం చేయాలి. రంగులు చిమ్మాలి. ఆశావహ దృష్టి అన్నది అన్ని వేళలా అవసరం. అది జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. - రఘు
301)ప్రశంస అనేది వంటికి సబ్బు లాంటిది...ఎంత బాగా వంటికి పట్టించుకుంటామో , అంతే బాగా కడిగేసుకోవాలి....లేకపోతే అది నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తుంది - రఘు "
302)మౌనం యొక్క ఫలితం ప్రార్ధన, ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం , నమ్మకం యొక్క ఫలితం ప్రేమ, ప్రేమ యొక్క ఫలితం సేవ, సేవ యొక్క ఫలితం సంతృప్తి.కాబట్టి దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది. - రఘు"
303)కష్టసుఖాలు పగలూరేయిల్లాంటివి. అవి ఒకదాని తరువాత ఒకటి వచ్చి పోతుండడం సహజం . కాబట్టి కష్టం వచ్చినా ,సుఖం వచ్చినా "ఇది మారుతుంది" అని గ్రహించగలిగిన నాడు మనం ప్రశాంతంగా జీవించగలం  - రఘు
304)నేటి సమాజంలో విజయం సాధించిన  వ్యక్తులు చాల మండే వున్నారు . కానీ విలువలతో కూడిన వ్యక్తుల జాబితా మాత్రం వేళ్ళ మీద లెక్కించగలిగిన సంఖ్యకే పరిమతం అయిపోయింది. అందుకే "విజయవంతమైన వ్యక్తిగా ఎదగడంకన్నా ,విలువల గల వ్యక్తిగా మారడం ఎంతో ముఖ్యం !! - రఘు
305)శాంతం సముద్రం లాంటిది’ అని అనడంలో శాంతగుణం కలిగి ఉండాలంటే సముద్రమంత సహనం, ఉదారత ప్రతి మానవునిలోనూ ఉండాలని అర్ధం కాబట్టి శత్రువులాంటి కోపాన్ని వదలి రక్షణగా నిలబడే శాంతగుణాన్ని అలవరచుకోవాలి. దానివల్ల సర్వవేళలా సుఖ సంతోషాలతో జీవించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచుకొన్న వారవుతారు. - రఘు
306)ఏదైనా ప్రారంభించటానికి ధైర్యం ఉండాలి. కొనసాగించటానికి కృషి ఉండాలి. పూర్తి చేయటానికి పట్టుదల ఉండాలి. ఈ మూడు స్టేజీల్లోనూ మొహం మీద చిరునవ్వు వుండాలి.కాబట్టి గొప్ప గొప్ప సహాయాలు చెయ్యక్కరలేదు. ఒక చిన్నపలకరింపు అవతలివారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైనది, వెలలేనిది 'చిరునవ్వు'.. దీనిని ఎప్పుడు కోల్పోకుండా జీవించే వాడికి కష్టాలని ఎదుర్కోవడం చాలా తేలిక  - రఘు "
307)ధనం పోగొట్టుకున్నారా? పర్లేదు మళ్ళి ఎలాగోలాగా సంపాదించుకోవచ్చు . ఆరోగ్యం పోగొట్టుకున్నారా? ఏదో ఒక ఆసుపత్రికి వెళ్లి తిరిగి తెచ్చుకోవచ్చు , కేరెక్టర్ పోగొట్టుకున్నారా? అంతా పోగొట్టుకున్నట్టే ..దీనిని తిరిగి తెచ్చుకోలేము ..కాబట్టి వ్యక్తిత్వాన్ని బట్టి మనిషిని అంచనావేస్తారు - రఘు"
308)ప్రతి వ్యక్తిలోనూ ఋషికి, రాక్షసునికి ఉండే ఆలోచనలు రెండూ ఉంటాయి. మనం దేనిని 'చైతన్యం' చేస్తామన్నదానిపై ఆ వ్యక్తీ గమనం, గమ్యం ఆధారపడి ఉంటుంది.కాబట్టి నీ ఆలోచనల బట్టే నీ ఎదుగుదల ఆధారపడి వుంటుం - రఘు
309)ఆటుపోట్లు..అవమానాలు, సమస్యలు, ప్రతికూల వాతావరణం...యిలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదగాలన్న తపన, కొత్తదనం కోసం నిరంతర అన్వేషణ చేస్తూ ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారు విజయతీరాలని వెంటనే అందుకోగలరు - రఘు
310)సరైన వాడకం లేని పనిముట్లకి తుప్పు పట్టినట్లే, సక్రమంగా వాడక పొతే మనిషి మనసు కైనా తుప్పు తప్పదు. అలాగే చక్కగా పట్టించుకోని తోట కలుపు మొక్కలకి నిలయమైనట్లే, నిర్లక్ష్యానికి గురైన ప్రతిభ నీరసించి నశించి పోతుంది.కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతిభతో కూడిన లక్ష్యం ఉండాలి  - రఘు
311)ప్రతి  ఒక్కరిలో సహజమైన ఒక అసాధారణ ప్రతిభ ఉంటుంది. అది ఒక ఆట అయి ఉండొచ్చు ఒక పాట అయి ఉండొచ్చు ఒక కళ అయి ఉండొచ్చు. కొంతమంది చాలా రంగాలలో సమర్ధులై ఉండవచ్చు. కానీ అన్నిటకన్నా ఎక్కువ నైపుణ్యం, మక్కువగల ప్రతిభ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిభ అంటే చాలా మంది తెలివితేటలు అనుకుంటారు. కాదు, అత్యంత సామర్ధ్యం, ఆసక్తి ఉన్న రంగం. తెలివితేటలు, నైపుణ్యం సాధన తో మెరుగు పరుచుకోవచ్చు. తమకు ప్రతిభ ఉన్న రంగాన్ని గుర్తించి, కృషి చేసిన వారు గొప్ప వారు కాగలరు. - రఘు
312)సహజంగా మనిషి తనను, తన కుటుంబ సభ్యులను ప్రేమిస్తాడు. వారి కోసమే కృషి చేస్తాడు. వారి అభ్యున్నతికై తన సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. మనసు వికసించే కొద్దీ బంధు మిత్రులను ఆదరించే స్థాయికి చేరుకుంటాడు. ఆ ప్రేమ విస్తరించి సమాజ శ్రేయస్సుని కాంక్షించినప్పుడు మానవసేవయే మాధవసేవ అని గ్రహించాలి . నిస్వార్థసేవాపరత్వం ఏర్పడినప్పుడే జీవితాశయాలైన శాంతీ, శాశ్వతానందం లభిస్తాయి. మన చుట్టూ ఎందరో నిస్సహాయులు, దీనులు, వికలాంగులు వుంటారు వారిని  ప్రేమతో కరుణతో వారిని ఆదరించడంలో వచ్చే తృప్తి మరెందులోనూ రాదు - రఘు
313)ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి లోపాలు లేనివాడు ప్రపంచంలో లేడు ,ఉండడు. ఆకాశంలో చంద్రుడికి మచ్చలుంటాయి . మచ్చలనే చూస్తే చంద్రుడు అందంగా కనిపించడు. వేడిని తలుచుకుంటే సూర్యుడి మీద కోపం వస్తుంది ఆ సూర్యకాంతే  లేకపోతే అసలు జీవన ఆధారముండదని తెలుసుకుంటే ఇక రెండో మాటే వుండదు కాబట్టి లోపాలని సరిదిద్దుకుంటే మంచి మనుషులం అవుతాం ,చక్కటి మనుగడ సాగిద్దాం  - రఘు
314)తన సామర్ధ్యం సాయంతో మనిషి జీవితంలో అత్యుత్తమ శిఖరాలని చేరుకోవచ్చు.అయితే, అక్కడనుంచి పడిపోకుండా ఉండాలంటే మాత్రం మచ్చలేని నడవడిక ముఖ్యం. - రఘు
315)జీవితం నిన్ను అనేక తెలివితక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది.నువ్వు తెలివైనవాడివైతే ఆ ప్రశ్నలనుంచి ఎంతోకొంత నేర్చుకుంటావ్.తెలివైన సమాధానం నుంచి తెలితక్కువవాడు నేర్చుకునేదానికన్న,తెలివితక్కువ ప్రశ్నలనుంచి తెలివైనవాడు నేర్చుకునేదే ఎక్కువ. - రఘు "
316)దేవుడికైతే మనం నిలువు దోపిడీ ఆలోచించకుండా ఇస్తాం అదే సాటి మనిషిని ఐతే ఆలోచించి మరీ ముంచుతాం దేవుడికైతే కోట్లు ఐనా హుండీలో త్రుణపాయంగా వేసేస్తాం అనాధ రోడ్దు మీద అడుక్కుంటుంటే ఒక్క రూపాయి దానం ఇవ్వటానికి సంకోచిస్తాం దేవుడికైతే ధూప దీప నైవేద్యాలతో విందు భోజనం పెడతాం ఆకలితో అలమటించే సాటి మనిషికి గుప్పెడు అన్నం పెట్టం దేవుడికైతే ఎక్కడో ఉన్నా కొండకి నడిచెల్లి మరీ మొక్కి వస్తాం సాటి మనిషి రోడ్డు మీద అపస్మారక స్థితిలో దిక్కు లేక పడి ఉన్నా ఓరగా చూస్తూ వెళ్ళుతాం దేవుడికైతే భజనలు చేయటానికి గుంపు కట్టి మరీ గంటలు గంటలు తగలేస్తాం కాని సాటి మనిషి కష్టాల్లో ఉంటే మాట్లాడానికి ఒక్క నిముషం కూడా టైమివ్వం దీన్ని బట్టి చూస్తే మానవ సేవే మాధవ సేవా లేక మాధవ సేవే మానవ సేవ అనాలో ఎవ్వరికి అర్ధం కాని పరిస్థితి - రఘు"
317)నువ్వు ఎత్తైన శిఖరం మీద ఉన్నా ,లోతైన లోయలో ఉన్నా నిలబడేది మాత్రం భూమిమీదనే అని గుర్తుంచుకో ,విజయం సాధిస్తే విర్ర వీగకు,ఆపజయం పొందితే కుమిలిపోకు,జయాపజయాలకు అతిగా చలించకు  - రఘు
318)దుస్సంకల్పమువలన ఎదుటివానికి కీడు చేసిన అంతకంటే పదింతలు తిరిగి వచ్చి కీడుగావిస్తాయి. అదేవిధంగా సత్సంకల్పములతో ఇతరులకు మేలు చేస్తే, ఎదుటివాడికి కలిగే మేలుకంటే పదింతలు మనకే మేలు జరుగుతుంది. - రఘు
319)జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటే సరిపోదు. ఆ ‘ఏదో ఒకటి’ అనేదాన్ని నిర్దేశించుకుని, నిబద్ధతగా దానికై రాత్రింబవళ్లు కృషి చేయాలి. - రఘు
320)పూజలు చేసి, మనం దేముణ్ణి వెదుక్కుంటూ వెళితే దానం చేసే వారిని వెతుక్కుంటూ భగవంతుడే వారి దగ్గరకు వస్తాడట. ఒక మనిషి మరణించినా, అతడు చేసిన దానధర్మాలవలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.కృష్ణార్పణం అని చెప్తూ చేసే దానలన్నీ నేరుగా ఆ భగవంతునికే చెందుతాయి. మనసా వాచా కర్మణా చేసే దానానికే ఫలితం ఉంటుంది. మనం చేసే దాన ధర్మాలన్నీ మనం పైజన్మకు దాచుకున్న నిధులవంటివేనని చెప్పవచ్చు. మానవ సేవే మాధవ సేవగా ఎంచి చేసే దానం అన్నిటికన్నా విశిష్టమైనది. - రఘు
321)కలిమిలో ఉన్నా ,లేమిలో ఉన్నా ,కష్టసుఖాలు పంచుకుంటూ కబుర్లు కలబోసుకొంటూ గంజయినా ,పరమాన్నమైనా కలిసి సేవిస్తే జీవితం స్వర్గం అవుతుంది. ఈర్ష్యా ద్వేషాలతో ,కలతలు,కలహాలతో  లేకుండా కలిసిమెలిసి జీవిస్తే ఆనందానికి లోటేముంటుంది ? - రఘు
322)ప్రపంచంతా డబ్బుమీదే నడుస్తుంది . ఆస్తి కోసం,డబ్బు కోసం ఎన్నయినా అన్యాయాలు చేసెవాల్లున్నారు . డబ్బే జీవిత పరమావధిగా కాదని గుర్తించాలి. మంచి,చెడు,ప్రేమ,అభిమానం ..ఇవన్ని కలిస్తేనే జీవితం .  ఎంత డబ్బున్నా ప్రేమగా పలకరించే మనిషి లేకపోతే పరిస్థితి దయనీయంగా ఉంటుంది మనుగడను అర్ధంవంతం ,మధురం చేసేవి ఆప్యాయత,అనుభందం ,అనురాగాలే .  - రఘు
323)ధైర్యం మన కంటికి కన్పించని ఆయుధం. అలాంటి ఆయుధం మన వెంటుంటే ఎంతటి శత్రువునైనా పాదాక్రాంతం చేసుకోవచ్చు - రఘు
324)మనం ఎటువంటి కష్టనష్టాలకు గురి అయినా ,ఓర్పు,సహనం లేకపోతే ---చుక్కాని లేని నావలా ఆ కష్టాల కడలి నుంచి ఒడ్డున పడలేము. కాబట్టి మనిషి విజయం రావాలంటే ఓర్పు సహనం ఎంతో  అవసరం - రఘు
325)సంకల్పబలం ఉంటే ఏ పనిని అయినా నిర్విఘ్నంగా పూర్తిచేయగలుగుతాము. గట్టి సంకల్పంతో పాటు మనం సాధించాలనుకున్న పనిమీద ఏకాగ్రత, పట్టుదల ఉండడం అత్యవసరం. కాబట్టి కార్యసాధనే తన ధ్యేయంగా భావించి ముందుకు వెళ్లి అనుకున్న పనిని నెరవేర్చగలిగిన వాడికే విజయం చేకూరుతుంది  - రఘు
326)ఎవరైతే పవిత్రమైన మనసుతో ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటారో, అట్టివారు తక్షణమే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. సంకల్పం నిస్వార్థమైనది అయితే అంతా శుభకరమే జరుగుతుంది. స్వార్థంతోకూడిన సంకల్పాలు ఎన్నటికీ నెరవేరవు. దాన్ని సాధించేందుకు నిత్యం ఆ భగవంతున్ని ప్రార్థించాలి ఎందుకంటే వ్యక్తి జీవితం అంతా సంకల్ప వికల్పాల చుట్టే తిరుగుతుంది.కాబట్టి  మానవ సంకల్పానికి దైవ సంకల్పం తోడైతే అది ఎంతటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది. - రఘు
327)ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనం కన్నా ధైర్యం మిన్నగా ఉండాలి. సమాజంలో ఎదురయ్యే సమస్యల సుడిగుండాల అంచులనుంచి తప్పించుకోవాలంటే ధైర్యం ఉండాలి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ధైర్యంతో పోరాడితే పోయేదేం లేదు వచ్చే విజయం తప్ప అన్నట్లుగా మనం ముందుకుసాగాలి.ఎన్ని కష్టాలైనా అనుభవించు కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మిః అన్నారు మన పెద్దలు. కనుక ఏ విషయంలోనైనా మంచిని గ్రహించాలి, చెడును దగ్గరకు రానీయకూడదు. మనకు తెలిసిన మంచిని నలుగురికి తెలియచేయాలి. అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి ధైర్యంగా చెప్పాలి. అలా మాట్లాడటమే న్యాయం చేయడం అవుతుంది. ఎవరికి వారు నీతిగా నిజాయతిగా వ్యవహరిస్తే చాలు ధైర్యం దానంతట అదే ప్రోది అవుతుంది. - రఘు
328)సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నమన పెద్దల మనసు తెలుసుకుని ప్రకృతిలోని రమణీయ దృశ్యాలనుతిలకించే ఆనందంతోపాటూ ఎదుటివ్యక్తి మనో వేదనను అర్థం చేసుకుని కన్నీళ్ళను తుడిచి ఆ వ్యక్తిలో చోటుచేసుకున్న అభద్రతా భావాన్ని తొలగించి ‘నీకు నేను తోడుగా ’అనే భరోసా ఇవ్వగలిగేటట్టు కన్నులను ఉపయోగంలోకి తెస్తే దేవుచ్చిన రెండు కళ్ళూ పునీతమవుతాయి. ఆ కళ్ళను పొందిన మానవుని జన్మ సార్థకమవుతుంది. - రఘు
329)మనకు లభించిన జీవితాన్ని చక్కగా వినియోగించుకుని, అహంకార, మమకారాలను తొలగించుకుని పరుల సేవలో పరమాత్మను దర్శించే నేర్పును అలవర్చుకుంటే మానవజీవితం సార్థకం అవుతుంది. - రఘు
330) నీ దారి నీవే వెతుక్కో, నీ గమ్యం నీవే నిర్దేశించుకో, దానిని చేరడానికి అసలు సిసలైన నిజాయితీ, నీతి, ఓర్పు, సహనం వంటి ఆయుధాలు పెంచుకోవాలి. అందరితో జ్ఞానాన్ని పంచుకోవాలి. ఇవన్నీ చేయటానికి సమయపాలన, నిబద్ధత, నిరంతర అభ్యాసన కావాలి. ఈ అందమైన జీవితం అద్భుతమైన, ఆదర్శవంతమైన ఒక వంతెనగా నిలవాలి. మహర్షిగా మారకపోయినా ఫర్వాలేదు. మహనీయునిగా అందరిచేత కీర్తింపబడకపోయినా ఫర్వాలేదు. ఈ లోకానికి మహారాజువి కాకపోయినా ఫర్వాలేదు. కానీ నీ మనఃసాక్షికి జవాబుదారిగా వుండు, నీ ప్రతి పనినీ చర్యను, చర్చను, నీ మనస్సుతో పంచుకో, తప్పొప్పులు నీవే నిర్దేశించుకో - రఘు
331)తప్పు చేసినట్లు గ్రహించాక ,ఎప్పటికప్పుడు క్షమాపణ చెప్పుకోవడం కాదు. చేసిన తప్పులని తిరిగి ఎప్పటికి చేయకూడదని చిత్తశుద్దితో మనస్సుని మలుచుకొవాలి. . మనలోని లోపాల గురించి ఎల్లవేళలా ఆలోచించడం కన్నా ,భవిష్యత్తులో మనం సాధించే లక్ష్యం వైపే విశ్వాసంతో అడుగు వేయడం క్షేమకరం ,శుభకరం  - రఘు
332)విజయానికి నిజమైన అర్ధం .. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే .. ప్రపంచంలో ఎవరికీ అన్ని విషయాలూ తెలియవు. అలా తెలియని విషయాలను తెలిసినట్లుగా మాట్లాడుతూ అన్ని విషయాలలో జోక్యం కల్పించుకోవడం అవివివేకమవుతుంది ..ప్రశాంతతకూ సంతోషానికీ ఇదీ ఓ మార్గం . అలాగే ఏ మాత్రం ఆలోచించకుండా అసహనంతో మాట్లాడే చిన్న మాట కూడా ఎదుటి వారికి చాలాకాలం గుర్తుండిపోతుంది . "అలా ఎందుకన్నామా " అన్న అంతర్మధనం వెంటాడకుండా ఉండాలంటే నోరును మాటను అదుపులోపెట్టుకోవడమే మేలైన మార్గం  - రఘు
333)దేనినైనా మన బలంతో సాధించాలి కానీ అవతలివారి బలహీనతతో కాదు. ఎందుకంటే, నిజమైన గెలుపు మన కృషి వల్లే లభిస్తుంది తప్ప, అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు! - రఘు
334) ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నాకెలాంటి బాధ లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని చెప్పలేరు. - రఘు
335)మనిషి తప్పు చేయడం సహజం, కాని చేసిన తప్పును తెలుసుకొనే  మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు, తన తప్పును  సరిదిద్దుకొనేవాడే ఉత్తమ పౌరుడు..కాబత్తి ఒప్పుకున్న తప్పు చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది - రఘు
336)మనిషి పుట్టినప్పుడు మిల్లులోంచి బైటికి వచ్చిన తెల్ల కాగితం మాదిరిగానే ఏ మచ్చా మరకా లేకుండా శుభ్రంగా ఉంటాడు. పెరిగే కొద్దీ పరిసరాల,పరిస్థితుల ప్రభావం అతనిపై పనిచేస్తాయి. విషయ జ్ఞానం, లోకజ్ఞానం పేరుతో నీతి,దైవం,ధర్మం,జ్ఞానం,మర్యాద,బాధ్యతల పేరుతో మతం,చెడ్డ సాంగత్యం ఇవన్ని కలిసి ఆ కాగితాన్ని చేయగలిగినంత మురికి చేస్తారు. కాగితమెంత ఎక్కువ మురికిగా ఉంటే అంత గొప్పగా చెలామణవుతుంది..అదే కలికాలపు యొక్క జీవితం - రఘు
337)కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది..కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి - రఘు
338)లక్ష్యసాధన మనిషిని కార్యసాధకుణ్ణి చేస్తే, త్యాగం మనిషిని పునీతుణ్ణి చేస్తుంది. సత్యభాషణం మంచివాణ్ణి చేస్తే, సహనం అజేయుణ్ణి చేస్తుంది.అందుకనే అవసరాలకోసం పోరాడే వారికన్నా, విలువకై పోరాడి గెలిచినవారు పరమోత్కుృష్టులు. విలువలకై పోరాడి విశ్రమించినవారు శ్రేష్ఠులు, చిరస్మరణీయులు.  - రఘు
339) త్యాగం లేని మనిషి జీవితం, ఊరు చివర వున్న బూఱుగు చెట్టు వంటిది ... ప్రకృతిని పరిశీలించినపుడు చెట్లు, నీరు, గాలి ఇతరులకు ఏవిధంగా సాయం చేస్తున్నాయో అర్థం అవుతుంది. ప్రకృతిని సృష్టించిన భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ మానవజన్మను పొందిన మనిషి ఎలా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలో ఆలోచించగలగాలి. అపుడే త్యాగంలోని విశిష్టత అవగాహనకు వస్తుంది. ఆ విశిష్ట లక్షణాన్ని అలవర్చుకుంటే జన్మసఫలం అవుతుంది. పది మంది మేలు కోరుకుంటూ వారికి సాయం అందించగలగడమే త్యాగం లోని పరమార్థం. - రఘు
340)ఒకరికి ఉన్నదాన్ని చూసి ఈర్శ్యాద్వేశాలకి గురికావడం నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది . ఉన్నతస్థాయికి ఎదిగేందుకు మార్గం అంకితభావంతో చేసే శ్రమ మాత్రమేనని గుర్తెరగాలి . కాబట్టి ప్రతి ఈర్ష్యాద్వేషాలతో మన మనస్సుని నాశనం చేసుకోకూడదు ,కాబట్టి శ్రమించడానికి శక్తి లేనప్పుడు ఉన్నదానితో తృప్తిపడే మనస్తత్వాన్ని కలిగి ఉండటమే గొప్ప సుగుణం  - రఘు
341)"అవకాశం" ఒక పక్షిలాంటిది.. అది ఒక ప్రదేశంలోనే ఉండదు.. ఒక చోటి నుంచి మరొక చోటికి ఎగిరి వెళ్ళిపోతుంది ... అందుకే పెద్దలు మంచి అవకాశాన్ని జారవిడుచుకోకు అంటారు  - రఘు
342)సందేహాలు మనుషుల్ని విడదీస్తాయి ,నమ్మకాలు మనుషుల్ని కలుపుతాయి కాబట్టి మనుషుల మధ్య బంధాలు గట్టిగా ఉండాలంటే సందేహాలని వీడి నమ్మకాన్ని పెంచుకోవాలి  - రఘు
343)పరిస్థుతులను అంచనా వేయడానికి కోపం,అసహనం అవరోధాలుగా నిలుస్తాయి .. కాబట్టి అంచన వేసేటప్పుడు వీటికి దూరంగ ఉంటె విజయం వరిస్తుంది  - రఘు
344)కష్టాలు రాకుండా దేవుడ్ని ప్రార్ధించకండి ... కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యన్నిమని ప్రార్ధించండి  - రఘు
345)తప్పులు చేయడం మానవ సహజం. తప్పు చేయనివాడు ధరణిలో లేడు అన్నది వాస్తవం . ఇదే మాట వల్లిస్తూ తప్పులు చేయడంకన్నా ఆయా తప్పులను తగ్గించుకునే దిశగా ప్రయత్నం చేయాలి..అప్పుడే నీకు విజయం చేకూరుతుంది - రఘు
346)నిన్ను నువ్వు పోషించుకోవడం మర్చిపోయిన కూడా కన్నా వాళ్ళని పోషించే బాధ్యత మాత్రం ఎప్పటికి మరవకు....ఎంత సంపాదించినా నీకు వచ్చేది డబ్బున్నవాడు అన్న పేరే కానీ మంచి మనిషి అన్న పేరు కాదు... ఆ పేరు నువ్వు పోగానే నీతో పాటే పోతుంది.. కానీ పదిమందికి మంచి కలిగేల ఒక్క పని చేసి చూడు అప్పుడు నీ పేరునువ్వు పోయాక కూడా నిన్ను బ్రతికేల చేస్తుంది.. డబ్బు సరదాలు కోపాలు తాపాలు పగలు అన్ని భావనలు తాత్కాలికమే.. ఇవన్ని నిన్ను బ్రతికుండగానే చంపేస్తాయి.. కానీ స్వచమైన ప్రేమని మనుషులకి పంచి చూడు నువ్వు చచ్చినా అందరి మనసులలో బ్రతికే ఉంటావ్ - రఘు
347)పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒకనాటికి మరణం అనివార్యం. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల దాని గురించి ఆలోచించకుండా భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం.ప్రతి మనిషి తోటి వారికి సాయం అందించాలి. మనకు సాయం చేసే వారికే కాకుండా, అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలడం దైవత్వం.కొవ్వొత్తి తాను కాలిపోతూ ఇతరులకు వెలుగు ఇచ్చే విధంగా, గంధపుచెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం ఉండాలి - రఘు
348) గుణంలో మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకుంటే జీవితంలో సుఖసంతోషాలకి తావేలేదు - రఘు
349)గొప్ప స్థానం ఎవ్వరికీ ఊరికినే రాదు. విజయాల్ని పొందిన వారిని చూసి స్ఫూర్తి పొందితే మనమూ జీవితంలో పైకివస్తాం. నీకన్నా ఎదుటివారు ఎక్కువగా ఉంటే అసూయపడకు. వారి విజయపరంపరకు కారణమేంటో ఆలోచించు. సరైన అన్వేషణ కొనసాగించు. అవిశ్రాంత పోరును సాగించు . అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. మరింత అద్భుతమైన నైపుణ్యంతో రాణించగలిగేలా మనల్ని మనం తీర్చిదిద్దుకుని ప్రకాశించడమే సరైన చర్య అని అంతా తెలుసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అది ప్రతి మజిలీలోను మనల్ని శిఖరాగ్రానికి తీసుకుపోతుంటుంది. - రఘు
350)దనం సంపాదించడం, ధనవంతుడు కావడం తప్పు కాదు. ధనవంతుల్ని చూసి దుఃఖిండచం, ఈర్ష్య పెంచుకోవడం, మనస్సులో హీన భావన తప్పు.మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం తప్పు. అలా ఆలోచించడం వల్ల మనం ఉంటున్న పూరిగుడిసెలో ఉన్న సుఖం కూడా మనకు దక్కకుండా పోతుంది. ఇతరులతో గొడవ పడే స్వభావం మనసులో ఈర్ష్యం, వారి పట్ల వ్యతిరేక ఏహ్య భావంతో కూడిన బేజాలు మనసులో పెరగడం ప్రారంభిస్తాయి . కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం ఆరోగ్యం కాదు.ఇలా గడిపే జీవితం ఉద్రిక్తతని సృష్టిస్తుంది. - రఘు
351) నిరాశతో ఏ పని ప్రారంభించిన అది పూర్తి కాదు. ఎంతో సులువైన పనికూడా పూర్తి చేయలేరు. నేను చేయగలను అనే ధీమాతో పని ప్రారంభిస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా సులువుగా చేయగల్గుతారు. కాబట్టి . మీ సర్వశక్తిని కూడగట్టుకుని ఆత్మవిశ్వాసంతో చేయడమే మీరు చేయగలిగిన పని. అదే మీకు విజయం తెచ్చి పెడుతుంది. నిరుత్సాహాన్ని దరిజేరనిస్తే మీ ప్రతిభలన్నీ అడుగంటిపోతాయి - రఘు
352)పని చేసేవారే తప్పో, రైటోచేస్తారు. ఏ పని చేయని వారు తప్పులు చేయరు. ఎందుకంటే తప్పుచేయడం అనేది తెలిసేది ఏదేనా పనిచేసినప్పుడే తెలుస్తుంది. అదే విధంగా ఏదైనా పనిచేస్తే విజయం సాధించడమో, అపజయం పాలు కావడమో సంభవిస్తుంది - రఘు
353)స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది - రఘు
354)మనిషికి తనమీద తనకు నమ్మకం ఉండాలి. ఏ పని అయినా చేయగలను అనే దృఢ నిశ్చయం ఉండాలి. ఆత్మవిశ్వాసం మాటల్లో వ్యక్తం కావాలి. కళ్లలో ప్రతిఫలించాలి. అప్పుడే ఎదుటి వ్యక్తులకు మనమీద నమ్మకం కలుగుతుంది. విజయం సాధించిన వ్యక్తులను పరిశీలిస్తే వారు చెప్పే మొదటి మాట ఆత్మవిశ్వాసం, రెండవది నమ్మకంతో పనిచేయటం. పనిలో విజయం సాధంచగలను అనే నమ్మకంతో పని చేయటంతో సగం విజయం మన సొంతమవుతుంది. - రఘు
355)మనిషి విజయానికి ప్రథమ శత్రువు అహంకారం. ఉన్నత శిఖరాల కూల్చివేతకు కారణం అహంభావం. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం అలవర్చుకోవాలి. వైఫల్యం ఇహాన్ని మరిపిస్తుంది. విజయం అహాన్ని కురిపిస్తుంది. వైఫల్యంలోను, విజయంలోను తటస్థంగా ఉండాలి. కాబట్టి అహంభావాన్ని త్యజించి విజయ లక్ష్యంతో ఏక దీక్ష, కఠోరశ్రమ, పట్టుదల, కార్యాచరణ అనే నాలుగు మూలస్తంభాల చుట్టూ తిరగాలి. అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు. - రఘు
356) జీవితంలో ఎదగాలంటే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. నేటి మొక్క రేపటి మహావృక్షం. నేటి సామాన్యుడు రేపటి మహామనిషి. అందుకు నిర్దేశిత లక్ష్యాలు, నిర్మాణాత్మక కృషివల్లే సంభవం. అందుకే నిదురించు నిరాశలను నిందిస్తూ కూర్చోక ఆదరించు ఆశలను ఆహ్వానించాలి. అవి జీవితంలో ఎదగటానికి తోడ్పడతాయి. - రఘు
357)అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్నసత్యం. కాబట్టి కరిగిపోయిన కాలాన్ని జరిగిపోయిన కథను, తలచుట వృధా. ప్రతి క్షణాన్ని, ప్రతి స్వప్నాన్ని సద్వినియోగపరచుట మేలు కదా! - రఘు