Saturday, June 13, 2020

నీ విలువ తెలుసుకుని మసులుకో

👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను.
నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*

అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*  మరియు *కుటుంబము* నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।

దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....
  ఈ జన్మకే....
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!

మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !

కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న
బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.

అదే  నిలుపుకోవాలంటే  ?

తము గడిపిన  భయంకర  అవస్థలు తమ
పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో
కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ  ,
ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే ,

తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు
తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు

 వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ ,
బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా
చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు
ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా
తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన అశాంతితో
జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .

ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?

దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?
జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు ,
అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం
 అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా
జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి , ఇంటి లోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు
కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా ,
చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని
శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి
విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?
ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.

కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా           ఈ  ఆస్థిపంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు.
ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.

మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?

  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ
కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా
మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు
కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే
అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం .
దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం
విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...
ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు
గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు
రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు. 🌻

        మీ
      రఘు